logo

కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్‌ దాఖలు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Published : 24 Apr 2024 16:43 IST

భువనగిరి: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియా పాయింట్లో ఆయన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి మందుల సామెల్, వేముల వీరేశంతో కలిసి మాట్లాడారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని