స్టేషన్కొచ్చే కేసులే.. యూట్యూబ్ పాఠాలుగా..
సైబర్ నేరాలు నిత్యకృత్యమయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము రెప్పపాటులో కాజేస్తున్నారు. సాధారణ రైతు నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీరు దాకా వీరి బాధితులే. హైదరాబాద్ సైబర్ క్రైం విభాగంలో
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న గృహిణి
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్: సైబర్ నేరాలు నిత్యకృత్యమయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము రెప్పపాటులో కాజేస్తున్నారు. సాధారణ రైతు నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీరు దాకా వీరి బాధితులే. హైదరాబాద్ సైబర్ క్రైం విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న భర్త ఇంటికి వచ్చాక స్టేషన్కు వచ్చిన ఇలాంటి కేసుల గురించి ఆమెతో మాట్లాడేవారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి బారినపడకుండా ఉండొచ్చని చెప్పేవారు. అలా వీటిపై అవగాహన పెంచుకున్న ఆమె ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆలోచించారు. గృహిణిగా ఇద్దరు చిన్నారుల సంరక్షణ చూసుకుంటూనే తెలుగులో క్రైం ఫ్రీ ఇండియా అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. రెండేళ్లుగా వివిధ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమే కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన గడ్డం సుశీల.
ఒక్కో వీడియోతో అడుగులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లికి చెందిన సుశీల వరంగల్ నిట్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుకున్నారు. భిక్కనూరుకు చెందిన మల్లేశ్తో 2015లో వివాహమైంది. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ 2020లో ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనికి మంచి స్పందన రావడంతో యూట్యూబ్ ఛానెల్ ఆలోచన చేశారు. ఈ అంశంపై అప్పటికి పోలీసుశాఖకు కూడా ఎలాంటి యూట్యూబ్ ఛానెల్ లేదు. భర్త సహకారంతో 2020 సెప్టెంబరు 14న తెలుగులో సైబర్ నేరాలపై మొట్టమొదటి ‘క్రైం ఫ్రీ ఇండియా’ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. రోజూ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకుంటూ వీడియోలు రూపొందిస్తున్నారు. అలా ఇప్పటి వరకు సైబర్ క్రైం, మహిళల అంశాలపై 50కిపైగా వీడియోలు పెట్టారు. 25 లైవ్ వీడియోలు చేశారు. ఈ ఛానెల్ను 20 వేల మందికిపైగా అనుసరిస్తున్నారు.
మెయిల్.. సెమినార్ల ద్వారా..
వీడియోలతోపాటు ఆయా కళాశాలల్లో భర్తతో కలిసి సెమినార్లు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం ‘౯i్ఝ’÷౯’’i-్టi్చజీ ్ణ్ఝ్చiః.‘్న్ఝ మెయిల్ను అందుబాటులో ఉంచారు. ఇందులో వచ్చిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని, చరవాణి పోయిందని, ఓటీపీ అడుగుతున్నారని ఎక్కువగా సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
పోలీసుశాఖ రివార్డు..
పోలీసుశాఖకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టేవారికి సివిలియన్ రివార్డు ఇస్తుంటారు. సుమారు రెండున్నరేళ్లుగా సైబర్ నేరాలపై వీడియోలు చేస్తున్న సుశీలకు గతేడాది ఇది వరించింది. హైదరాబాద్ సీటి పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ మేరకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మున్ముందు కొనసాగించాలని ఆయన సూచించారు.
నకిలీ సైట్లతో భద్రం: గడ్డం సుశీల
అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఆన్లైన్ షాపింగ్ పేరిట వస్తున్న నకిలీ సైట్లు, వాట్సాప్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో చాటింగ్, బహుమతులు వచ్చాయని పంపే లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు కూడా అదే స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఆధార్, పాన్ కార్డుల సమాచారం గోప్యంగా ఉంచాలి. వీటి వివరాలను ఫోన్లో ఎవరు అడిగినా ఇవ్వకూడదు. అవసరమైతే బ్యాంకుకు వెళ్లి సందేహం నివృత్తి చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
[ 07-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద చేపట్టిన పనులను పాఠశాలలు తెరిచే లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 07-05-2024]
భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం యువ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. -
భారీ మెజారిటీతో శెత్కర్ను గెలిపించాలి
[ 07-05-2024]
మండలంలో తాండూరు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెత్కర్కు మద్దతుగా స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. -
దళిత వికాస ఇన్ఛార్జిలకు సన్మానం
[ 07-05-2024]
తాండూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను జహీరాబాద్ పార్లమెంట్ దళిత వికాస ఇన్ఛార్జిగా నియమితులైన ప్రభాకర్ను, ఎల్లారెడ్డి నియోజకవర్గ దళిత వికాస ఇన్ఛార్జిగా ఎన్నికైన బోరంచ సాయిలను కాంగ్రెస్ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 07-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
ఉత్సాహంగా వేసవి శిబిరం
[ 07-05-2024]
ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి, భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. -
కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఇందుప్రియ
[ 07-05-2024]
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్పర్సన్ ఇందు ప్రియ అన్నారు. -
భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 07-05-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు... -
ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
అగ్రనేతలు వస్తున్నారు
[ 07-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. -
నేతల నోట.. తీయటి మాట
[ 07-05-2024]
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. -
ఆమె నిర్ణయం.. అభ్యర్థి విజయం
[ 07-05-2024]
ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు. -
ఐదంచెల భద్రతా వ్యవస్థ
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చి తీరుతాం’
[ 07-05-2024]
తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. -
‘వ్యాపారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం’
[ 07-05-2024]
కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. -
ఇటు తనిఖీలు.. అటు దోస్త్ నోటిఫికేషన్
[ 07-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆదాయానికి గండి
[ 07-05-2024]
‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. -
మళ్లీ భగ్గుమన్న భానుడు
[ 07-05-2024]
జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది. -
గడపగడపకు బూత్స్థాయి కమిటీలు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. -
‘70 ఏళ్లుగా ఓటేస్తున్నా’
[ 07-05-2024]
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. -
11న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ఎంపీగా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం