కోమాలో ట్రామా
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ట్రామా కేంద్రాన్ని 14 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భవన నిర్మాణం జరగలేదు.
ఏళ్ల నుంచి మెరుగుపడని సేవలు
న్యూస్టుడే, కామారెడ్డి వైద్యవిభాగం
ట్రామా కేంద్రం నిర్వహిస్తున్న గది
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ట్రామా కేంద్రాన్ని 14 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భవన నిర్మాణం జరగలేదు. అందుబాటులో ఉన్న గదిలోనే నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర నిర్వహణకు వైద్యులను నియమించలేదు. కేంద్ర నిధులతో ఏర్పాటైన ట్రామాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైద్యులను నియమించుకోవాలని సూచించినా ఆ దిశగా చర్యలు లేవు. ఏళ్ల నుంచి పరిస్థితిలో మార్పు కానరావడం లేదు.
రూ.4.5 కోట్లతో హంగులు
ట్రామా కేంద్రంలో పరికరాల ఏర్పాటు పూర్తి చేశారు. ఒక వాహనాన్ని సమకూర్చారు. రూ.4.5 కోట్లతో ఆధునిక హంగులను సమకూర్చారు. ఇక్కడ రోగుల తాకిడి అధికంగా ఉంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నెలకు 100-120 రోడ్డు ప్రమాదాల కేసులు వస్తుంటాయి. తీవ్రంగా గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలందించాల్సి ఉండగా.. వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ట్రామాకేర్ ఏర్పాటైనా సేవలు అందించడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది.
పరికరాలు వృథా..
ట్రామాకేర్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాలు వృథా అయ్యాయి. కామారెడ్డిలో కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఆక్సిజన్, రక్తస్రావాన్ని నియంత్రించడం, గుండె పనితీరును మెరుగుపరచడం తదితర ప్రక్రియలకు వాడే పరికరాలు వినియోగంలో లేవు. కాగా ట్రామా కేంద్రానికి వేరుగా ప్రత్యేక నిపుణులను కేటాయించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో సేవలందిస్తున్నామన్నారు.
ప్రమాద బాధితుల పరిస్థితి
ప్రమాదాల్లో గాయపడిన వారిలో చాలామంది తీవ్రమైన రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం, గాయాలు, మానసికంగా ఆందోళన చెందుతారు. ప్రమాదం జరిగిన గంటలోపే ఆసుపత్రికి తరలించి అంతర్గత రక్తస్రావం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఆక్సిజన్, రక్తం ఎక్కించడం తదితర ప్రాథమిక వైద్యసేవలు అందిస్తే 20 శాతం వరకు ప్రాణాపాయం నుంచి గట్టెక్కే వీలుంది.
వివరాలు (రోజుకు)
ఓపీ 900-950
ఐపీ 40-60
రోడ్డు ప్రమాద కేసులు 10
వైద్య సిబ్బంది జాడేది..?
జాతీయ రహదారులకు సమీపంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ట్రామాకేర్ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమిస్తామని గతంలో ప్రకటించారు. ప్రతి కేంద్రంలో ముగ్గురు ఎముకల వైద్య నిపుణులు, ముగ్గురు మత్తుమందు వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 29-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని ఎదల్కన్ చెరువు వద్ద 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. -
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 29-04-2024]
ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెలా లక్ష్మీనారాయణ అన్నారు. -
ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి కూలీలు
[ 29-04-2024]
ఉపాధి హామీ పథకం సీనియర్ మేట్ నాగరాజు పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912
[ 29-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. -
పోలీసు పరిశీలకుడికి స్వాగతం
[ 29-04-2024]
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. -
భానుడు భగభగ
[ 29-04-2024]
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్లో 39.5 డిగ్రీల ఎండ కాచింది. -
ఆగని గంజాయి రవాణా
[ 29-04-2024]
జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
నిఘా నేత్రం.. సమస్తం నిక్షిప్తం
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. -
‘గల్ఫ్ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?
[ 29-04-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బరిలో ఉండేదెవరో?
[ 29-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. -
నేనండి..ఈవీఎంని
[ 29-04-2024]
ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. -
ఎల్లలు దాటిన నాట్యాభినయం
[ 29-04-2024]
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. -
ముగ్గురూ.. గతంలో పోటీ చేసిన వారే
[ 29-04-2024]
ప్రస్తుతం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది. -
స్కాన్ చేయండి... వివరాలు తెలుసుకోండి
[ 29-04-2024]
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. -
కాలూరుకు చెందిన గర్భిణి మృతి
[ 29-04-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రచారానికి పొలంబాట
[ 29-04-2024]
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!