వైద్యకళాశాలలో వసతులు ఉన్నాయా?
గతంలో వైద్య విద్య కమిషన్ సభ్యులు నేరుగా వచ్చి వైద్యకళాశాలతో పాటు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందించే సేవలను గమనించేవారు.
ఆన్లైన్లో పరిశీలించనున్న కమిషన్
జిల్లా వైద్యకళాశాల
ఈనాడు, కామారెడ్డి: గతంలో వైద్య విద్య కమిషన్ సభ్యులు నేరుగా వచ్చి వైద్యకళాశాలతో పాటు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందించే సేవలను గమనించేవారు. ప్రస్తుతం గతానికి భిన్నంగా మొదటిసారి వైద్యకళాశాలలోని తరగతి గదులు, లాబొరేటరీలు, గ్రంథాలయం, బోధనాసుపత్రి నిర్వహణ, బోధన సిబ్బంది హాజరు, పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా ఆన్లైన్లోనే వైద్యవిద్య కమిషన్ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యకళాశాల యంత్రాంగం కళాశాలలోని వసతులకు సంబంధించిన చిత్రాలు, బోధనాసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, ఇతరత్రా వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. ఆచార్యుల నియామకం, హాజరు తీరే ప్రధాన సమస్యగా మారింది. వైద్య విద్య కమిషన్ ఈ అంశంపైనే ప్రధాన దృష్టి సారించే అవకాశముంది.
బోధనాసుపత్రిలో సరిపడా లేని సౌకర్యాలు
జిల్లా ఆసుపత్రిగా ఉన్న భవనాన్ని బోధనాసుపత్రిగా మార్చి పడకల సంఖ్యను పెంచినా.. ఆ స్థాయిలో వసతులు సమకూరలేదు. దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల కిందట బోధనాసుపత్రిలోని ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాతాశిశు సంరక్షణ కేంద్రం కోసం నిర్మించిన భవనంలో తాత్కాలికంగా వైద్యకళాశాలను నిర్వహిస్తున్నారు. కళాశాలకు ప్రత్యేకంగా భవనం నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో భవన నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం బోధనాసుపత్రిలో అత్యవసర రోగులకు సైతం పడకలు లభించని పరిస్థితి ఉంది. ఆసుపత్రి భవనం ఇరుకుగా ఉండడంతో రోగులకు, వైద్యులకు ఇబ్బందిగా ఉంది.
హాజరు అంతంత మాత్రమే
ఆచార్యుల కొరతతో రోగులకు నాణ్యమైన సేవలు అందడం లేదనే విమర్శలున్నాయి. దీనికి తోడు ఆచార్యులు వచ్చినా గంట, గంటన్నరకు మించి ఆసుపత్రిలో సేవలు అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఆచార్యులతో పాటు వైద్యకళాశాల, బోధనాసుపత్రి సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాలని ఏడాది క్రితమే వైద్యవిద్య కమిషన్ ఆదేశించినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆచార్యుల కొరతను తీర్చేందుకు వైద్యవిధాన పరిషత్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే వైద్యవిధాన పరిషత్, వైద్య విద్య ఆచార్యుల మధ్య సమన్వయం కొరవడడం సమస్యగా మారింది.
తీరని ఆచార్యుల కొరత
హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉన్నా ఆచార్యుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వైద్యకళాశాలలో విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించనున్నారు. ఆచార్యుల కొరతతో వారు కొంత మేర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పద్నాలుగు మంది సహాయ ఆచార్యులు కొత్తగా విధుల్లోకి వచ్చారు.
నమోదు పూర్తి చేశాం
- డాక్టర్.వెంకటేశ్వర్లు, కామారెడ్డి వైద్యకళాశాల ప్రిన్సిపల్
జాతీయ వైద్యవిద్య కమిషన్ నిర్దేశానుసారం కళాశాలతో పాటు బోధనాసుపత్రిలోని వసతులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను పూర్తిచేశాం. ఇటీవల ప్రభుత్వ ఆదేశానుసారం ఒప్పంద ప్రాతిపదికన ఆచార్యులు, సహాయ ఆచార్యుల నియామకం చేపట్టాం. రోగులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912
[ 29-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. -
పోలీసు పరిశీలకుడికి స్వాగతం
[ 29-04-2024]
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. -
భానుడు భగభగ
[ 29-04-2024]
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్లో 39.5 డిగ్రీల ఎండ కాచింది. -
ఆగని గంజాయి రవాణా
[ 29-04-2024]
జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
నిఘా నేత్రం.. సమస్తం నిక్షిప్తం
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. -
‘గల్ఫ్ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?
[ 29-04-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బరిలో ఉండేదెవరో?
[ 29-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. -
నేనండి..ఈవీఎంని
[ 29-04-2024]
ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. -
ఎల్లలు దాటిన నాట్యాభినయం
[ 29-04-2024]
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. -
ముగ్గురూ.. గతంలో పోటీ చేసిన వారే
[ 29-04-2024]
ప్రస్తుతం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది. -
స్కాన్ చేయండి... వివరాలు తెలుసుకోండి
[ 29-04-2024]
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. -
కాలూరుకు చెందిన గర్భిణి మృతి
[ 29-04-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రచారానికి పొలంబాట
[ 29-04-2024]
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.