జనావాసంలో పట్టాభిషేకం
శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం, ఆ సమయంలోనే యుద్ధం.. ఇలా ఎన్నో ఘట్టాలు ఎదుర్కొని రాజుగా పట్టాభిషేకం పొందారు. ఆయన పాలన, జీవించిన విధానం వంటివి ఎన్నో విలువైన సద్గుణాలను తెలియజేసేది రామాయణం.
ఎన్నికలకు మిగిలింది కొద్ది రోజులే
అభ్యర్థులకు ఈసీ నిర్దేశించిన ఎన్నికల వ్యయం : రూ.95 లక్షలు
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్ : శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం, ఆ సమయంలోనే యుద్ధం.. ఇలా ఎన్నో ఘట్టాలు ఎదుర్కొని రాజుగా పట్టాభిషేకం పొందారు. ఆయన పాలన, జీవించిన విధానం వంటివి ఎన్నో విలువైన సద్గుణాలను తెలియజేసేది రామాయణం. అంతటి మహత్తర రామాయణంలోని ఎన్నో విషయాలు నేటికీ ఆచరణీయమే. ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల ఘట్టం మొదలైంది. పాలకులను ఎన్నుకునే పోలింగ్ ప్రక్రియ రామాయణంలోని కొన్ని ఘట్టాలకు సరిగ్గా నప్పుతుంది. ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల ప్రక్రియ, ఆ తర్వాత ప్రజల మధ్యకెళ్లి ప్రచారం చేయడం. పోలింగ్ రోజు ఓటర్లంతా ఓటేసి పట్టాభిషేకం చేస్తారు. ఆ రోజు బరిలో ఎవరికి ఎక్కువ ఓట్లేస్తే వారికే పట్టం కట్టినట్లు కౌంటింగ్ రోజు తేలిపోతుంది. ఈ పట్టాభిషేకానికి ముందు కొన్ని ఘట్టాలను అభ్యర్థులు దాటాల్సి ఉంటుంది. వాటిని శ్రీరామనవమి సందర్భంగా పోటీదారులు ప్రచార వ్యూహానికి అన్వయించుకుని ముందుకు సాగాలి.
తండ్రి ఆదేశం ప్రకారం రామయ్య వనవాసానికి వెళ్లారు. ఇప్పుడు పార్టీలు అభ్యర్థులు తమ అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లాలి. అందుకు దాదాపు ఏప్రిల్ 18 నుంచి మే రెండో వారం వరకు జనావాసం చేయాల్సిందే. సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిసి వారి అభిమానాన్ని కూడగట్టుకోవాల్సి ఉంటుంది. అలనాడు రాముడి వనవాసం దండకారణ్యంలో సాగితే... నేడు అభ్యర్థులు జనారణ్యంలో కొనసాగాలి. అప్పుడే ఓటర్లు పట్టం కడతారు.
అభిమాన సైన్యం
రాముడు తన అటవీ క్షేత్రంలో ప్రతి సంఘటనను జయించడానికి ఆయనతో పాటు కొందరు సైనికుల్లా తమవంతు పాత్ర పోషించి రామచంద్రుడిపై తమ భక్తిని, అభిమానాన్ని చాటుకున్నారు. తమ స్థాయిలో పనులు చక్కబెట్టి రాముడి విజయానికి బాటలు వేశారు. ఇప్పుడు నాయకులు సైతం అంత చిత్తశుద్ధితో పనిచేసే సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. విభిన్న నేపథ్యం ఉన్నా... రాముడికి సమన్వయంతో సేవలందించిన తీరును అనుసరించాలి. యుద్ధంలో గెలిచి అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు అందరినీ కలుపుకొని వెళ్లాలి.
మండలం, నియోజకవర్గం ఇలా వివిధ హోదాలు ఉన్నా పార్టీల్లో బూత్స్థాయిలో కన్వీనర్లే ప్రధాన సైనికులు. అలా ఒక్కో పార్టీకి ఒక్కో కన్వీనర్ ఉంటారు.
ధర్మ విధానం
రాముడు తన ధర్మం కోసమే చివరి వరకు పోరాడినట్లు చెబుతారు. కుటుంబంలో అందరి మద్దతు ఉన్నా.. ఎవరు ఎన్ని చెప్పినా ధర్మం ప్రకారం వనవాసం అయ్యాకనే పాలన చేపట్టాడు. అభ్యర్థులు ఎన్నికల బరిలో ధర్మ మార్గంలో... అంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన పద్ధతిలో పోటీని ఎదుర్కోవాలి. ప్రలోభాలతో ఓటర్ల మనసు గెలిచే ప్రయత్నం ధర్మం కాదని ఎన్నికల నియమావళి చెబుతుంది.
దుష్ప్రచారానికి దూరం
యుద్ధాన్ని నీతిగా గెలవాలి. రాముడు తన జీవిత కాలంలో అదే పాటించాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కువ ప్రమాదకరం ఈ దుష్ప్రచారమే. పోటీలో గెలవడానికి ప్రలోభాలు ఒక ఎత్తైతే ప్రత్యర్థిని దెబ్బ తీయడానికి టెక్నాలజీని వాడుకుని అనుకరణలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిస్తుంటారు. విద్వేషపూరితమైన వాటికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించే ప్రయత్నాలు సాగుతుంటాయి. అవి ఒక్కోసారి ప్రచారం చేసిన వారికే చేటు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే జిల్లాలో పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా... క్షేత్రస్థాయిలో సామాజిక మాధ్యమాల్లో తమ అభిమాన నాయకుల విషయంలో పోటాపోటీగా వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. తక్కువ నిడివి వీడియోలతో దుష్ప్రచారం పెరుగుతోంది.
వేగులతో వ్యూహం
రాముడిని యుద్ధంలో బలహీనపరచడానికి పలువురిని పురమాయించాడు రావణుడు. ఎన్నికల క్రతువులోనూ అలాంటి ఎత్తులు కొనసాగే ఆస్కారముంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాక అంతర్గత సమావేశాల్లో ఇవే విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు ఒక వాదన. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నాయకులు కాస్త అప్రమత్తమయ్యారు.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు : 7 ఓటర్లు : 16,89,957
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటేసేందుకు అర్హులు
- ఆర్మూర్ : 2,10,734
- బోధన్ : 2,21,314
- బాల్కొండ : 2,25,260
- నిజామాబాద్ అర్బన్ : 2,99,647
- రూరల్ : 2,54,136
లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు : 1,807
మూడు పార్టీలకు కలిపి అవసరమైన కన్వీనర్లు 5,421
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 29-04-2024]
ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెలా లక్ష్మీనారాయణ అన్నారు. -
ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి కూలీలు
[ 29-04-2024]
ఉపాధి హామీ పథకం సీనియర్ మేట్ నాగరాజు పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912
[ 29-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. -
పోలీసు పరిశీలకుడికి స్వాగతం
[ 29-04-2024]
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. -
భానుడు భగభగ
[ 29-04-2024]
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్లో 39.5 డిగ్రీల ఎండ కాచింది. -
ఆగని గంజాయి రవాణా
[ 29-04-2024]
జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
నిఘా నేత్రం.. సమస్తం నిక్షిప్తం
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. -
‘గల్ఫ్ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?
[ 29-04-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బరిలో ఉండేదెవరో?
[ 29-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. -
నేనండి..ఈవీఎంని
[ 29-04-2024]
ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. -
ఎల్లలు దాటిన నాట్యాభినయం
[ 29-04-2024]
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. -
ముగ్గురూ.. గతంలో పోటీ చేసిన వారే
[ 29-04-2024]
ప్రస్తుతం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది. -
స్కాన్ చేయండి... వివరాలు తెలుసుకోండి
[ 29-04-2024]
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. -
కాలూరుకు చెందిన గర్భిణి మృతి
[ 29-04-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రచారానికి పొలంబాట
[ 29-04-2024]
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్