తొమ్మిదేళ్లకు ఊరట
గిరిపల్లెల్లో పండించే వాణిజ్య, ఔషధ గుణాలున్న పంటల్లో పిప్పళ్లు ప్రధానమైంది. మన్యంలో సుమారు ఐదువేల ఎకరాల్లో దీన్ని పండిస్తున్నారు. ప్రభుత్వపరంగా కొనుగోలు చేయకపోవడం, ప్రైవేటు వ్యాపారులే దిక్కవటంతో వారు నిర్ణయించిన
పెరిగిన పిప్పళ్ల ధర
ప్రైవేటు తక్కువ ధరకు విక్రయిస్తున్న సరకు
పాడేరు పట్టణం, న్యూస్టుడే: గిరిపల్లెల్లో పండించే వాణిజ్య, ఔషధ గుణాలున్న పంటల్లో పిప్పళ్లు ప్రధానమైంది. మన్యంలో సుమారు ఐదువేల ఎకరాల్లో దీన్ని పండిస్తున్నారు. ప్రభుత్వపరంగా కొనుగోలు చేయకపోవడం, ప్రైవేటు వ్యాపారులే దిక్కవటంతో వారు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోంది. తొమ్మిదేళ్లగా తగ్గుముఖం పట్టిన పిప్పళ్ల ధర ఈ ఏడాది పెరగడంతో గిరి రైతులకు కొంత ఉపశమనం కలిగింది.
పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, డుంబ్రిగుడ తదితర మండలాలతో పాటు ఒడిశా సరిహద్దుల్లో పిప్పళ్లను సాగు చేస్తున్నారు. దీన్ని ఎంతకాలం భూమిలో ఉంచితే అంత నాణ్యత ఉంటుంది. దీంతో కనీసం రెండు నుంచి మూడేళ్లు, ఆపైన ఐదేళ్ల వరకు ఉంచుతారు. గతంలో పిప్పళ్ల ద్వారా గిరి రైతులకు ఏటా లక్షలాది రూపాయలు ఆదాయం సమకూరేది. కొన్నేళ్లుగా అంతా తిరోగమనంలో ఉంది.
ముంబయికి తరలింపు
మన్యంలో గిరి రైతులు పండించిన పిప్పళ్లను ముంబయికి తరలిస్తున్నారు. దీనికి ముఖ్యంగా వడ్డాది మాడుగుల వ్యాపారులు కొనుగోలు చేసి అక్కడ శుభ్రం చేసి తరలిస్తున్నారు. వీటిని ముంబయిలో ఔషధాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పిప్పళ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కూడా వీటి కొనుగోలులో చేతులెత్తేయడంతో ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. ఏటా నష్టాలు వస్తున్నా.. సాగు మానలేక రైతులు నలిగిపోయేవారు.
కుంగదీస్తున్న దళారుల బెడద
అసలే పడిపోతున్న పిప్పళ్ల ధరలతో నష్టాల్లో మునిగిన రైతులకు దళారుల బెడద మరింత కుంగదీస్తోంది. వి.మాడుగుల వ్యాపారులకు, రైతులకు మధ్య దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. ధరలు లేనివాటికి స్ప్రింగ్ త్రాసులు, ఇతరత్రా కాటాలతో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు కూడా నష్టాల పాలవుతున్నారు. సరకు ఎక్కువగా వస్తే ధరలు తగ్గడం, సరకు తక్కువగా వస్తే ధరలు పెంచడం చేస్తున్నారు.
తొమ్మిదేళ్లుగా ధరలు తగ్గుముఖం
పిప్పళ్ల ధరలు తొమ్మిదేళ్లుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. పదేళ్ల క్రితం వరకు ధరలు ఏటా పెరుగుతుండడంతో దీని సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. ఆ తర్వాత నుంచి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం పిప్పళ్లు మొదటి రకం కేజీ రూ. 500 నుంచి రూ.800, రెండోరకం కేజీ రూ.300 నుంచి రూ.500 వరకు, మూడోరకం కేజీ రూ.60 నుంచి 100 పలికేవి. ప్రస్తుతం మొదటిరకం కేజీ రూ.350 నుంచి రూ. 420 లోపు, రెండోరకం రూ.280 నుంచి 320వరకు, మూడోరకం రూ.150 నుంచి 190 లోపే పలుకుతున్నాయి.
లావాదేవీలు ఘనం ...సౌకర్యాలు శూన్యం
మన్యంలో వారపు సంతలే కేంద్రంగా కోట్లాది రూపాయల మేర పిప్పళ్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఎక్కడా అవసరమైన సౌకర్యాలు లేవు. ప్రతి వారపు సంతలోనూ పాడేరు మార్కెట్ కమిటీ పన్ను వసూలు చేస్తున్నా.. రైతులకు సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం రైతులు ఉండటానికి, తీసుకొచ్చిన సరకును ఎండా వానల నుంచి రక్షణకు షెడ్లు నిర్మించకపోవడంతో ఆరుబయటే అవస్థలు పడి విక్రయిస్తున్నారు.
నష్టం వస్తున్నా మానలేదు
పిప్పళ్ల వల్ల తొమ్మిదేళ్లుగా పెద్దగా లాభాలు లేవు. అలవాటు పడ్డాము కాబట్టి చాలా ఇబ్బందులు పడినా వ్యాపారం కొనసాగిస్తున్నాం..
- శెట్టి వెంకట రమణ, వ్యాపారి, సంతారి గ్రామం, హుకుంపేట మండలం
శ్రమకు తగ్గ ఫలితం లేదు
పిప్పళ్లను సాగుచేస్తున్నా శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోయింది. ఒక వారం ధరలు పెరిగితే మరో వారం తగ్గుతున్నాయి. దీంతో ఎప్పుడు అమ్మితే లాభం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ధరలు పెరగడంతో కొంత ఆనందంగా ఉంది.
- కొండబాబు, ఇరాడపల్లి గ్రామం, పాడేరు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..