logo

రెవెన్యూశాఖ ప్రాంతీయ సదస్సు నేడు

రెవెన్యూశాఖ ప్రాంతీయ సదస్సు శనివారం బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్లో జరగనున్నది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూ.గో., డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు సదస్సుకు హాజరుకానున్నారు.

Published : 04 Feb 2023 05:18 IST

పాల్గొననున్న 9 జిల్లాల  అధికారులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: రెవెన్యూశాఖ ప్రాంతీయ సదస్సు శనివారం బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్లో జరగనున్నది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూ.గో., డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు సదస్సుకు హాజరుకానున్నారు. వీరితో పాటు ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీఓలు, సబ్‌కలెక్టర్లు, సర్వేశాఖ సహాయ సంచాలకులు, ఎంపిక చేసిన తహసీల్దార్లు పాల్గొంటారు. విశాఖ జిల్లాలో 22ఎ నుంచి తమ భూములను మినహాయించాలని 2500 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇంత వరకు 250 వరకు పరిష్కరించగా, మరో 200 వరకు తిరస్కరించారు. గతంలో సిట్‌ సిఫార్సుల మేరకు కొన్ని భూములను 22ఎలో చేర్చారు. ఆయా సిఫార్సులు ఇంత వరకు అమలు కాలేదు. రెవెన్యూ సదస్సులో ఆయా సమస్యలకు ఏమైనా పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. భూముల రీసర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో పలు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం విశాఖ చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని