logo

నేడు చంద్రబాబును కలవనున్న చిరంజీవిరావు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి ఎన్నికైన తెదేపా అభ్యర్థి డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు  పార్టీ అధినేత చంద్రబాబునాయుడును సోమవారం కలవనున్నారు.

Published : 20 Mar 2023 03:04 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి ఎన్నికైన తెదేపా అభ్యర్థి డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు  పార్టీ అధినేత చంద్రబాబునాయుడును సోమవారం కలవనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు వేపాడతో పాటు పార్టీ నేతలు వెళ్లనున్నారు. తాను కదిరి వెళ్లి లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొంటానని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని