విశాఖను వదిలి రైలెళ్లి పోతోంది..!
రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు.
దువ్వాడ మీదుగా 35 సర్వీసుల రాకపోకలు
దక్షిణ కోస్తా రైల్వేజోన్ రాకపోవడమే కారణం
ఐదేళ్లుగా పట్టించుకోని జగన్ ప్రభుత్వం
చలువతోట(రైల్వేస్టేషన్), న్యూస్టుడే: రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. మరో పక్క వారంలో 35 వరకు రైళ్లు విశాఖ రాకుండా దువ్వాడ స్టేషన్ మీదుగా వెళ్లిపోతున్నాయి. విశాఖలో తగినన్ని ప్లాట్ఫాంలు లేకపోవడం, స్టేషన్లోకి వచ్చిన ప్రతి రైలు, ఇంజిన్ మార్చుకుని బయలుదేరాలంటే 20 నిమిషాలకుపైగా సమయం పట్టడం దీనికి కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బల్బ్ స్టేషన్, మర్రిపాలెం స్టేషన్ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారమై ఉంటే వాటిల్లో ఒక్కటైనా పట్టాలెక్కేది. కాని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జోన్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రైల్వే జోన్ వచ్చి ఉంటే..
‘బల్బ్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన స్థలం ఇవ్వడానికి పోర్టు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమే. అయితే కొంచెం దృష్టిపెడితే మర్రిపాలెం స్టేషన్ను అభివృద్ధి చేయవచ్చు. గతంలో దీన్ని టెర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని భావించారు. ఈ మేరకు కొన్ని పనులు కూడా చేశారు. తర్వాత ఏమైందో ఏమో అది అటకెక్కింది. ఇక్కడ నాలుగైదు ప్లాట్ఫారాలు నిర్మిస్తే చాలు.. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను ఇక్కడి నుంచి పంపించవచ్చు. తద్వారా దువ్వాడ మీదుగా వెళ్లే రైళ్లను విశాఖకు మళ్లించవచ్చ’ని ఎప్పటి నుంచో రైల్వే వినియోగదారుల సంక్షేమ సంఘం చెబుతోంది. రైల్వే జోన్ సాకారమై ఉంటే ఈ ప్రతిపాదన పట్టాలెక్కి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపే అవకాశం ఉండేదని, కేవలం జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు మంచి అవకాశం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థలం విషయంలో ప్రభుత్వం దొంగాట..
దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అవసరమైన స్థలం కేటాయింపులో వైకాపా ప్రభుత్వం దొంగాట ఆడింది. ముడసర్లోవలో సుమారు 52 ఎకరాల స్థలం కేటాయించామని, రైల్వే అధికారులే తీసుకోలేదని చెప్పింది. వాస్తవంగా ఆ స్థలం రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో ఉండడంతో తెదేపా హయాంలో అప్పటి కలెక్టర్ యువరాజ్ నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో పట్టాలు కలిగి ఉన్న గిరిజనులను ఖాళీ చేయించారు. వీటన్నింటినీ దాచిపెట్టిన వైకాపా ప్రభుత్వం స్థలం ఇచ్చేసినట్లు నమ్మబలికింది. చివరికి రైల్వేశాఖ మంత్రి లోక్సభలో వాస్తవాలు చెప్పడంతో జగన్ ప్రభుత్వ దొంగాట బయటపడింది. రైల్వేజోన్ సాకారమై ఉంటే రైల్వేబోర్డు వచ్చేదని, విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మంచి జరిగేదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఆర్ఆర్బీ పరీక్షలు రాయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.
దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
- టాటానగర్-ఎర్నాకుళం-టాటానగర్(నిత్యం)
- బెంగళూరు-హావ్డా-బెంగళూరు (5రోజులు) (విజయనగరం మీదుగా).. బీ బెంగళూరు - హావ్డా-హావ్డా ఎక్స్ప్రెస్ (ఒకరోజు)
- భువనేశ్వర్-చెన్నై-భువనేశ్వర్ ప్రత్యేక రైలు (ఒకరోజు) బీ హావ్డా-సత్యసాయి ప్రశాంతి నిలయం-హావ్డా రైలు (ఒకరోజు)
- కామాఖ్య- బెంగళూరు- కామాఖ్య ప్రత్యేక రైలు (ఒకరోజు) బీ భువనేశ్వర్- తిరుపతి-భువనేశ్వర్ ప్రత్యేక రైలు (ఒకరోజు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
[ 28-04-2024]
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. -
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా
[ 28-04-2024]
జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన మ్యానిఫెస్టో తుస్సుమందని తెదేపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. కొత్తవి లేక పోగా ఉన్న పథకాలను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఎస్ఎస్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి
[ 28-04-2024]
స్టాటిస్టికల్ సర్వెలెన్స్ బృందాల (ఎస్.ఎస్.టి.) పనితీరును విశాఖ లోక్సభ నియోజకవర్గ కేంద్ర వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ శనివారం ఉదయం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. -
పేదల ఆశలపై నీళ్లు.. పాలకులేనా వీళ్లు!!
[ 28-04-2024]
‘జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను. 2020 వరకు సమయం ఇవ్వండి. -
మహిళల ఓటుతో వైకాపాకు గుణపాఠం: శ్రీభరత్
[ 28-04-2024]
వైకాపా దుష్టపాలనను అంతమొందించడానికి మహిళలు సంఘటితం కావాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ పిలుపునిచ్చారు. -
‘తెదేపాతోనే రాష్ట్రానికి పూర్వవైభవం’
[ 28-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ భార్య, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అన్నారు. -
పెదజాలారిపేటను కాపాడుకుందాం
[ 28-04-2024]
తూర్పు నియోజకవర్గంలోని పెదజాలారిపేట పేరిట జరిగిన రూ.2500 కోట్ల టీడీఆర్ కుంభకోణం గురించి వివరించిన తెదేపా నాయకులు పెదజాలారిపేటను కాపాడుతామని గ్రామస్థులకు హామీఇచ్చారు. -
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
[ 28-04-2024]
జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం సమీపాన శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, -
‘కొర్రీల’మస్తు.. ‘ఆంక్షల’ తోఫా
[ 28-04-2024]
పేదింటి ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకాలనే వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ కల్యాణమస్తు పేరుతో అమలు చేస్తోంది. -
ధర పెరిగింది.. వినోదం తగ్గింది
[ 28-04-2024]
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అంతర్జాలం, వినోదాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్ నెట్ పథకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. -
జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తా
[ 28-04-2024]
అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేశారు
[ 28-04-2024]
పాయకరావుపేటలో ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేసి, ఇంకొక వ్యక్తిని అభ్యర్థిగా తీసుకొచ్చారంటూ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు. -
పేటలో ఓడిన వారికి చోటులేనట్లే!
[ 28-04-2024]
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేది పెద్దల మాట. ఎన్నికల్లో ఒకసారి ఓడితే రెండోసారి పోటీచేసి విజయం కోసం ప్రయత్నించడం సాధారణం. -
ఎనిమిదేళ్ల కిందట.. సరిగ్గా ఇక్కడే..
[ 28-04-2024]
నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా మరోసారి ఉలిక్కి పడింది. గతంలో ఇదే తరహా ఘోర రోడ్డు ప్రమాదం ఇక్కడే జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. -
నామపత్రాలను ఉపసంహరించుకొనే వారెందరు?
[ 28-04-2024]
జిల్లాలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామపత్రాలు దాఖలు చేసిన వారిలో తొలిరోజు శనివారం ఎవరూ ఉపసంహరించుకోలేదు. -
ఎన్నికల వేళ.. ఇదేమి తీరు!!
[ 28-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ డేటా ఎంట్రీ’ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ
[ 28-04-2024]
రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. -
ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’
[ 28-04-2024]
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..