logo

Ysrcp: కోడ్‌ ‘ముత్తంశెట్టి’ బస్సులకు వర్తించదా?

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా  అవంతి కళాశాలల బస్సులపై ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ పోస్టర్లు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. బుధవారం కళాశాల విద్యార్థులతో వెళుతుండగా ఓ బస్సుపై పోస్టర్లు ఉండటం చర్చనీయాంశమయింది.

Updated : 21 Mar 2024 07:25 IST

ఈనాడు-విశాఖపట్నం: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా  అవంతి కళాశాలల బస్సులపై ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ పోస్టర్లు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. బుధవారం కళాశాల విద్యార్థులతో వెళుతుండగా ఓ బస్సుపై పోస్టర్లు ఉండటం చర్చనీయాంశమయింది. వీటిపై సీఎం జగన్‌, ఎమ్మెల్యే ముత్తంశెట్టి చిత్రాలున్నాయి. గతేడాది అక్టోబర్‌లో తగరపువలసలో నిర్వహించిన సాధికారి బస్సు యాత్రకు ప్రజలను తరలించేందుకు అవంతి కళాశాలల బస్సులను ఉపయోగించారు. ఆ సమయంలో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లు ఇంకా బస్సులకు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తొలగించాలనే విషయమే మరిచిపోయారనే విమర్శలొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని