సారూ.. రైతుల కన్నీళ్లు తుడవండి!
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. సిరులు కురిపిస్తే బంగారు బాటలు వేసుకుందామని రైతులు ఆశపడ్డారు. వడగళ్ల వాన పసిడి పంటలపై ఫిరంగుల యుద్ధమే చేసి విలయతాండవం చేసింది. కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి నష్టాలను దిగుబడి చేసుకునే రైతన్న బతుకు అకాలంగా కురిసిన వడగళ్ల వర్షంతో అతలాకుతలమైంది.
నేడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఉన్నతాధికారులు రాక
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. సిరులు కురిపిస్తే బంగారు బాటలు వేసుకుందామని రైతులు ఆశపడ్డారు. వడగళ్ల వాన పసిడి పంటలపై ఫిరంగుల యుద్ధమే చేసి విలయతాండవం చేసింది. కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి నష్టాలను దిగుబడి చేసుకునే రైతన్న బతుకు అకాలంగా కురిసిన వడగళ్ల వర్షంతో అతలాకుతలమైంది.
కదిలించిన ‘ఈనాడు’ కథనాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 10 నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన బీభత్సానికి తోడు వడగళ్లు కురవడంతో వారం రోజుల వ్యవధిలో చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు స్తంభాలు విరిగాయి.. అకాల వర్షాలకు మొక్కల ఆకులు, పూత, కాత లేకుండా మోడులు మాత్రమే మిగిలాయి. రైతుల దీనస్థితిపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలకు స్పందించిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన సూచన మేరకు మంత్రులు, ఉన్నతాధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. రైతులతో మాట్లాడి పంట నష్టం అంచనా వేయనున్నారు.
నడికూడలో ఓ రైతు..
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆయన సూచన మేరకు మంత్రులు, వ్యవసాయ అధికారులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వీరు తమ కష్టాలను చూసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని బాధిత రైతులు కోరుతున్నారు.
పర్యటన ఇలా: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావు, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 10.30 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చేరుకుని రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి దుగ్గొండి మండలం మీదుగా నర్సంపేటకు వెళ్తారు. వర్షాలకు నష్టపోయిన మిరప రైతులను కలుసుకుంటారు.
హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తికి చెందిన ఈ రైతు మొండయ్య. మిర్చి పంట బాగా కాసింది. ఈ ఏడాది చెతికొచ్చిన పంటను అమ్మితే వచ్చిన పైసలతో మనవరాలికి బంగారం చేయిద్దామనుకున్నారు. నేను చచ్చిపోయన రోజు నామీద పడి ఎడవకపోతదా అని బరువెక్కిన గుండెతో రోదిస్తూ రాలిపోయి కుళ్లిన మిర్చి పంటను మీద పోసుకుంటూ బోరుముంటున్నారు రైతు మొండయ్య.
కన్నీరు పెడుతున్న ఈ మహిళా రైతు హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తికి చెందిన అల్లె బుచ్చమ్మ. వడగళ్ల వర్షానికి నాలుగు ఎకరాల మిర్చి తోట పూర్తిగా నాశనమైంది. ఆమెకు నిమోనియా ఉండగా రూ.5 లక్షలు పెట్టి చికిత్స చేయించుకున్నారు. కుమారుడికి కరోనా వస్తే రూ.10 లక్షలు ఖర్చయ్యాయి. పంటకు రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుదామనుకున్నారు. చెడగొట్టు వాన పంటను సర్వ నాశనం చేసిందని.. ఎలా బతికేదని ఆమె గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఈయన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కలకత్తా తండాకు చెందిన సోమన్న. ఎకరంన్నరలో మొక్కజొన్న సాగు చేశారు. రూ.30 వేల పెట్టుబడి పెట్టారు. అకాల వర్షంతో పంటంతా పూర్తిగా నేలపాలై చేతికి రాకుండా దెబ్బతింది.
పంట చేతికొచ్చిన సమయంలో వర్షం ముంచింది
- ముత్తెబోయిన శేషగిరిరావు, సుందరయ్యకాలనీ, వాజేడు మండలం
సొంతంగా అరెకరం, ఎకరం కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం పడటంతో తీవ్రంగా నష్టపోయాను. రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. చేసిన కష్టం, పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. ప్రభుత్వం ఆదుకొని పరిహారం ఇస్తే కొంత ఊరట కలుగుతుంది.
నేను పాకాల.. నా మొర ఆలకించరూ..
కాకతీయుల వారసత్వ సంపదగా వరంగల్ జిల్లాలో విరాజిల్లుతున్న నా పేరు పాకాల సరస్సు. ఏటా ఖరీఫ్, యాసంగి పంటలకు నీరందిస్తూ రైతుల సేవలో తరిస్తున్నాను. నా నీటితో 30 వేల ఎకరాలు పచ్చని పంటలతో అలరారుతున్నాయి. కష్ణానదికి ఉన్న ఉపనదుల్లో ఒకటైన మున్నేరు నా నుంచే అడుగులు వేస్తుంది. అన్నదాతలకు సాగు నీరందిస్తూ వారి కన్నీళ్లును తూడుస్తున్నాను. నా దురదృష్టం వల్ల గేట్లు తెరవకుండానే నీరంతా లీకవుతూ వృథాగా పోతోంది. నా రైతుల కష్టాలు చూడలేకపోతున్నాను. తూములు, పంటకాలువల ఆధునికీకరణ చేపట్టేందుకు నిధులు ఇవ్వాలని కోరుతున్నా. వరంగల్ జిల్లాకు వస్తున్న మీరంతా నామొర ఆలకించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని అనుకుంటున్నా..
ఇట్లు..
పాకాల సరస్సు, ఖానాపురం మండలం (ఖానాపురం, న్యూస్టుడే)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ ప్రసంగం.. కాంగ్రెస్లో ఉత్తేజం
[ 08-05-2024]
వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ విజయవంతమైంది. -
హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారా..
[ 08-05-2024]
‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి, అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్లో చేరాను తప్ప.. పదవులకు ఆశపడి కాదని’ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మండలంలోని తాటికొండ గ్రామంలో మంగళవారం నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన సింగపురం ఇందిరతో కలిసి పాల్గొని మాట్లాడారు -
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి మధ్య వాగ్వాదం
[ 08-05-2024]
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
[ 08-05-2024]
వేసవి ఎండల తాపానికి జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుకూలంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అధికారులు మెరుగైన సరఫరాకు గత నాలుగు నెలలుగా చర్యలు చేపట్టారు. -
మేడిగడ్డలో.. మూడు గంటలు
[ 08-05-2024]
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో మూడు గంటల పాటు పరిశీలన చేపట్టారు. -
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
[ 08-05-2024]
మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. గాలిదుమారంతో మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. -
అధిక స్థానాల్లో కాంగ్రెస్దే విజయం
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే ఐదు అమలు చేసింది..రైతుబంధు ద్వారా నిధులు జమచేసింది రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. -
‘మోదీనే దేశానికి పెద్ద దిక్కు’
[ 08-05-2024]
దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు అన్నారు -
రోడ్డుపై చెట్టు విరిగిపడి యువకుడి దుర్మరణం
[ 08-05-2024]
ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. -
ఓటేద్దామని మాటిద్దాం..!
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు -
‘కడియం, అరూరికి ఓటుతో బుద్ధిచెప్పాలి’
[ 08-05-2024]
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. -
వన ప్రేమికుడు... వేలుపుల సారయ్య
[ 08-05-2024]
ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు. -
ఎంపీ ల్యాడ్స్ కేటాయింపు ఇలా..
[ 08-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
హలో.. మీ ఓటు ఎటు?
[ 08-05-2024]
సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్ రింగైనట్లు అనిపించింది. -
కమలదళం,, గెలుపు వ్యూహం
[ 08-05-2024]
వరంగల్ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్