logo

వెంటాడిన విధి: ఒకే చోట నాడు తల్లి.. నేడు తనయుడు..

ఒకే ప్రాంతంలో జాతీయ రహదారిపై నాడు తల్లి.. నేడు తనయుడు  ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. శంషాబాద్‌ పోలీసులు, స్థానికుల కథనం

Updated : 09 Mar 2022 08:18 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఒకే ప్రాంతంలో జాతీయ రహదారిపై నాడు తల్లి.. నేడు తనయుడు  ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. శంషాబాద్‌ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తొండుపల్లికి చెందిన రాచమల్ల చంద్రయ్య- పద్మమ్మ దంపతులకు నలుగురు సంతానం. చంద్రయ్య గతంలో అనారోగ్యంతో మృతిచెందాడు. పద్మమ్మ రెండేళ్ల క్రితం తొండుపల్లి వద్ద బెంగళూర్‌ జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఆమె మూడో కుమారుడు కుమార్‌(35) డీసీఎం డ్రైవర్‌. పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. తల్లి చనిపోయిన ప్రాంతంలోనే రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, పదేళ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని