logo

Telangana News: కొడుకు చూస్తుండగానే తండ్రి ఆత్మహత్య

పదేళ్ల కుమారుడు చూస్తుండగానే తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ ఎన్‌.చంద్రబాబు, ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ బాలాజీనగర్‌కు చెందిన అమర్లపూడి సాయికుమార్‌(35) 12 ఏళ్ల క్రితం సునీతతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

Published : 02 Apr 2022 08:49 IST

సాయికుమార్‌

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: పదేళ్ల కుమారుడు చూస్తుండగానే తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ ఎన్‌.చంద్రబాబు, ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ బాలాజీనగర్‌కు చెందిన అమర్లపూడి సాయికుమార్‌(35) 12 ఏళ్ల క్రితం సునీతతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన పోచారంలోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. భార్య సంస్కృతిటౌన్‌షిప్‌లో పని చేస్తుంది. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని భార్య తరచూ గొడవ పడేది. గురువారం ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త ఇంట్లో నుంచి బయటకెళ్లారు. సాయంత్ర ఇంట్లో ఉన్న కొడుకును బయటకు పంపించి సాయికుమార్‌ తలుపు వేసుకున్నారు. అనుమానం వచ్చిన కుమారుడు కిటికీ నుంచి తలుపు తీయాలని గట్టిగా కేకలు వేశారు. తండ్రి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయాన్ని తల్లికి చరవాణి ద్వారా సమాచారమిచ్చాడు. స్థానికులను చెప్పడంతో వారు వచ్చి తలుపు పగులగొట్టారు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని