logo

Hyd News: అవుటర్‌పై థమ్స్‌అప్‌ లోడ్‌ లారీ బోల్తా.. సీసాలు ఎత్తుకెళ్లేందుకు ఎగబడిన జనం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఘట్‌కేసర్‌ మార్గంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు థమ్స్‌అప్‌ లోడ్‌తో వెళుతున్న లారీ టైర్‌ పేలడంతో అదుపుతప్పి రింగ్‌ రోడ్డులోని

Updated : 20 Apr 2022 07:17 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఘట్‌కేసర్‌ మార్గంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు థమ్స్‌అప్‌ లోడ్‌తో వెళుతున్న లారీ టైర్‌ పేలడంతో అదుపుతప్పి రింగ్‌ రోడ్డులోని విభాగినిపై పడిపోయింది. దీంతో లారీలోని థమ్స్‌అప్‌ శీతల పానీయం సీసాలు రహదారికి ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని పట్టించుకోకుండా వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపై నిలిపి అందిన కాడికి ఆ సీసాలను తీసుకెళ్లారు. కొంతసేపట్లోనే లారీలోని మొత్తం సరకు ఖాళీ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని