logo

TS News:‘నిన్ను పెళ్లి చేసుకోను.. వేరే ఎవర్నీ చేసుకోవద్దు’

ఓ యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్‌పల్లి

Updated : 21 Jan 2022 09:36 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ఓ యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ పెద్దపల్లి మండలానికి యువతి (24) మూడేళ్లుగా ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేసుకుంటూ మేడ్చల్‌లోని వసతి గృహంలో ఉంటోంది. నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌ శంకరంపేట్‌ మండలం గద్దెపక్క గ్రామానికి చెందిన ఉకంటి రాజేంద్రప్రసాద్‌ (26)తో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ యువకుడు ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే నిందితుడు ఫొటోలు, వీడియోలు తీశాడని బాధితురాలు పేర్కొంది. వివాహం గురించి అడిగినప్పుడల్లా దాటవేస్తూ వస్తున్నాడని తెలిపింది. కొద్దిరోజులుగా పెళ్లిచేసుకోనని, వేరేవారిని వివాహం చేసుకుంటే తనవద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని