Food Innovations : యుద్ధాలు వచ్చాయి.. కాఫీ, క్యాండీ తెచ్చాయి!
ప్రస్తుతం మనం తింటున్న క్యాండీలు (candy), కుర్కురేలు, తాగుతున్న ఇన్స్టంట్ కాఫీ (Instant Coffee).. ఇళ్లలో వాడుతున్న ఎయిర్ ఫ్రయర్స్ (Air Fryers), మైక్రోవేవ్ అవెన్ (Microwave Ovens)అన్నీ యుద్ధాలతో సంబంధం కలిగి ఉన్నాయి. అదెలాగో తెలుసుకోండి.
‘అవసరమే ఆవిష్కరణకు మూలం’. ప్రతి అవసరం ఓ ఆవిష్కరణ దిశగా అడుగులు వేయిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ యుద్ధ సమయాల్లో (World wars) సైనికులకు రోజూ తాజా ఆహారం దొరికేది కాదు. దాంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. ఆ క్రమంలో ఎన్నో ఆహార ఉత్పత్తులు (Food Innovations) కనిపెట్టారు. అవేంటో తెలుసుకోండి.
నిల్వ మాంసం
అమెరికన్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ‘హార్మెల్ ఫుడ్ కార్పొరేషన్’ 1937లో పంది మాంసాన్ని నిల్వ చేసే విధానాన్ని కనుగొనింది. దానికి ‘స్పామ్’ అనే పేరు పెట్టింది. ఇందులో పంది మాంసంతో పాటు ఉప్పు, నీరు, బంగాళదుంప పొడి, చక్కెర, సోడియం నైట్రైట్ ఉండేవి. ఇవి తిన్న సైనికులకు మంచి శక్తి లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికా సైన్యం సుమారు 150 మిలియన్ పౌండ్ల ఆహారాన్ని కొనుగోలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ ఆహారం ఎంతగానో ఉపయోగపడింది. అప్పటి నుంచి అమెరికా సైనికులు ఏ దేశంలో శిబిరం ఏర్పాటు చేసినా ఈ తరహా ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకెళ్తున్నారట. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది.
తక్షణ శక్తినిచ్చే క్యాండీలు
స్పానిష్ సివిల్ వార్ సమయంలో ఫారెస్ట్ మార్స్ ఎస్ఆర్. అనే వ్యాపారవేత్త పలు రకాల క్యాండీలను తయారు చేశాడు. మిల్కీ వే, మార్స్ చాక్లెట్ బార్స్, ఎం అండ్ ఎం చాక్లెట్ పేరుతో వాటిని మార్కెట్లో విక్రయించేవారు. అధిక చక్కెర శాతంతో తయారైన వీటిని తిన్న వారికి తక్షణశక్తి లభించేది. అందుకే ఆయన వీటిపై అప్పట్లోనే పేటెంట్ తీసుకున్నాడు. ‘నోటిలోనే కరిగిపోతాయి.. మీ చేతిలో కాదు’ అంటూ మార్స్ క్యాండీ కంపెనీ ‘ఎం అండ్ ఎం’ ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ అమెరికా సైన్యానికి విక్రయించింది.
ఎయిర్ ఫ్రయర్
విలియం మ్యాక్సన్ అనే యూఎస్ నేవీ అధికారి ఎయిర్ ఫ్రయర్ను కనుగొన్నారు. తొలి ఎయిర్ ఫ్రయర్ దాదాపు 35 పౌండ్ల బరువుండేదట. దాని పేరు మ్యాక్సన్ వర్ల్విండ్ ఒవెన్. దానిని అల్యూమినియం, స్టీల్తో తయారు చేశారు. 120 వోల్ట్ల డీసీ మోటార్ను వినియోగించుకొని అందులో ఆహారాన్ని వేడి చేయొచ్చు. ఆరు రకాల పదార్థాలను ఒకేసారి ఇందులో వేడి చేసుకోవచ్చనే విషయం కనుక్కున్నారు. 1947లో ఆయన చనిపోయారు. 2008లో ఫిలిప్స్ కంపెనీ మళ్లీ ఎయిర్ ఫ్రయర్లను విస్తృతంగా ప్రవేశపెట్టింది. దాంతో ప్రతి కిచెన్లోనూ వీటి వాడకం పెరిగింది.
మైక్రోవేవ్ ఒవెన్
మైక్రోవేవ్ను ఓ ఇంజినీర్ కాకతాళీయంగా కనిపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేథియాన్ ఇంజినీర్ పర్సీ లా బారెన్ స్పెన్సర్ మ్యాగ్నెట్రాన్స్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. ఆ ప్రక్రియలో భాగంగా ఓ క్రియాశీల రాడార్ ఎదుట అతను నిల్చొని ఉండగా.. తన జేబులోని క్యాండీ బార్ కరిగిపోయింది. దాంతో ఆయన పాప్కార్న్లు తయారు చేసేందుకు యత్నించి సఫలీకృతుడయ్యాడు. తర్వాత అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు అన్ని రకాల ఆహారాలు వండే మైక్రోవేవ్ ఒవెన్ అభివృద్ధి చేయగలిగారు. ఫలితంగా 1945లో ఒవెన్కు పేటెంట్ పొందారు. దానికి రాడార్ రేంజ్ అనే పేరు పెట్టారు. మొదట్లో ఆ మైక్రోవేవ్ ఆరు అడుగులు ఉండేదట.
ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ
1906లో ఫ్రాన్స్లో జాక్ ఆర్సన్ డాసన్వల్ ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీని కనుగొన్నాడు. యుద్ధ సమయంలో రక్తంలోనీ సీరంను నిల్వ చేసేందుకు మొదట్లో ఈ సాంకేతికతను వినియోగించేవారు. తరువాత నాటిక్ ల్యాబ్స్ దాన్ని నాసా వ్యోమగాముల కోసం మరింత అభివృద్ధి చేసింది. దాంతో తేలికైన, అధిక కేలరీలతో కూడిన ఆహారం తయారైంది.
చీజ్ ఉత్పత్తులు
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కుర్కురే సహా అన్ని రకాల ప్రాసెస్డ్ చీజ్ ఉత్పత్తులన్నీ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అమెరికా మిలటరీ కృషి మూలంగానే వచ్చాయి. 1943లో డీహైడ్రేటెడ్ చీజ్ పౌడర్ను అభివృద్ధి చేశారు. దాంతో అమెరికా సైన్యం అనేక ఉత్పత్తులను సేకరించి పెట్టింది. ఎంతలా అంటే యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆ ఉత్పత్తులు నిల్వ ఉండే స్థాయిలో ఆ సేకరణ సాగింది. 1948లో వాటిని ఫ్రిటో-లే అనే కంపెనీకి విక్రయించారు.
ఇన్స్టంట్ కాఫీ
1901లో సటోరి కటో అనే జపనీస్-అమెరికన్ శాస్త్రవేత్త నీటిలో కరిగే కాఫీ పౌడర్ను తయారు చేశాడు. కానీ ఆ ఉత్పత్తికి గిరాకీ రాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కాగానే అమెరికా మిలటరీ రోజుకు 37వేల పౌండ్ల ఇన్స్టంట్ కాఫీని కొనుగోలు చేసిందట. ప్రస్తుతం ఇళ్లు, మాల్స్, కార్యాలయాల్లో ఇన్స్టంట్ కాఫీకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో చెప్పనవసరం లేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు