ఒక రెస్టారెంట్.. ఒక్క రోజు.. ఒక్కరే కస్టమర్
కరోనా కట్టడిలో ప్రపంచమంతా ఒకతీరుగా ఉంటే స్వీడన్ మాత్రం భిన్నంగా ఉంది. దేశాలన్నీ లాక్డౌన్ విధించి.. కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ దేశంలో చిన్నపాటి నిబంధనలతో అన్ని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎందుకలా అంటే.. ప్రజలు స్వతహాగా క్రమశిక్షణతో.. సమాజంపై
కరోనా కట్టడిలో ప్రపంచమంతా ఒక తీరుగా ఉంటే స్వీడన్ మాత్రం భిన్నంగా ఉంది. దేశాలన్నీ లాక్డౌన్ విధించి.. కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ దేశంలో చిన్నపాటి నిబంధనలతో అన్ని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎందుకలా అంటే.. ప్రజలు స్వతహాగా క్రమశిక్షణతో.. సమాజంపై బాధ్యతతో కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలి గానీ.. బలవంతంగా వారిపై ఆంక్షలు విధించొద్దు అని ఆ దేశాధినేతలు సెలవిస్తున్నారు. దీంతో స్వీడన్లో ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూనే తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని రెస్టారెంట్లు డైనింగ్ టేబుళ్లను దూరం దూరం పెట్టి.. పరిమిత సంఖ్యలో కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ స్వీడన్ జంట వినూత్న రెస్టారెంట్ను ప్రారంభించబోతుంది. ఆ రెస్టారెంట్లో ఒక రోజు కేవలం ఒక్క కస్టమర్కే ఆహారం అందిస్తారట. ఈ విచిత్రమైన రెస్టారెంట్ గురించి మీరూ తెలుసుకోండి.
స్వీడన్లోని వార్మ్లాండ్కి చెందిన భార్యభర్తలు రాస్మస్ పెర్సన్.. లిండా కార్లసన్ మే10న ‘టేబుల్ ఫర్ వన్’ పేరుతో రెస్టారెంట్ను ప్రారంభించనున్నారు. అదేదో రద్దీగా ఉండే కమర్షియల్ ప్రాంతంలో అనుకుంటే పొరపాటే.. ఈ జంట పెట్టనున్న రెస్టారెంట్ ఓ కాలనీలో, వాళ్లు నివస్తున్న ఇంటి పక్కన ఉండే పొలంలోనే. పొలం మధ్యలో ఒక డైనింగ్ టేబుల్, ఒక కుర్చీని మాత్రమే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పెర్సన్ ఇంటి వంటగదికి ఓ తాడు కట్టి.. దానికి ఓ బుట్ట వేలాడదీశారు. రెస్టారెంట్కు వచ్చిన వాళ్లు ఆ టేబుల్ వద్ద కూర్చొని ఆర్డర్ ఇస్తే పెర్సన్ జంట తాజాగా వండి బుట్టలో పెట్టి టేబుల్ వద్దకు పంపుతారన్నమాట. అయితే ఈ రెస్టారెంట్లోకి ఒక రోజు కేవలం ఒక కస్టమర్కి మాత్రమే అనుమతిస్తారట.
ఈ ఆలోచన ఎందుకొచ్చింది?
లాక్డౌన్ సమయంలో కార్ల్సన్ తల్లిదండ్రులు వారి ఇంటికి వచ్చారట. ఇల్లు కొంచెం చిన్నది కావడం.. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఇంటి పక్కన ఉన్న పొలంలో భోజనం ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని భోజనం చేయడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే ఈ వసతిని అందరికి కల్పించాలని పెర్సన్ జంట నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
‘‘ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఉండొచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఇక్కడ భోజనానికి ఇంత ధర అని నిర్ణయించలేదు. ఎవరికి ఎంత వీలు అయితే అంత ఇవ్వొచ్చు. ఈ రెస్టారెంట్ కేవలం భోజనం చేయడానికే కాదు.. వచ్చే వ్యక్తి ఈ ప్రశాంతమైన చోట ఒంటరిగా కూర్చొని తన గురించి తాను ఆలోచించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది’’అని పెర్సన్ దంపతులు చెబుతున్నారు. మే 10 నుంచి ఆగస్టు 1 వరకు ఈ రెస్టారెంట్ను నిర్వహించనున్నారు. రెస్టారెంట్కు వచ్చే స్పందనను బట్టి కొనసాగించాలా వద్ద అని నిర్ణయిస్తారట.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం