జాదవ్‌ కేసు: ‘భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి’

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌......

Published : 04 Sep 2020 01:30 IST

ఇస్లామాబాద్‌: పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించే పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు గురువారం విచారించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు పాకిస్థాన్‌.. భారత్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ను జారీ చేసిందని ఆ దేశ అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావేద్‌ ఖాన్‌ కోర్టుకు తెలిపారు. జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించాలన్న పాకిస్థాన్‌ ప్రతిపాదనకు భారత్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వాదనలు విన్న ఇస్లామాబాద్‌ హైకోర్టు తమ ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాక్‌ ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్‌ మిలటరీ హైకోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని