జనవరి తొలివారంలో ఆక్స్ఫర్డ్ టీకా?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తోన్న ఆక్స్ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ తొందరలోనే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
క్లారిటీ ఇచ్చిన బ్రిటన్ ఆరోగ్యశాఖ
లండన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తోన్న ఆక్స్ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ తొందరలోనే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్కు జనవరి 4వ తేదీన యూకేలో అందుబాటులోకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై తాజాగా బ్రిటన్ ఆరోగ్యశాఖ స్పందించింది. ‘వ్యాక్సిన్ ప్రయోగాల సమాచారాన్ని విశ్లేషించేందుకు నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ)కు కొంత సమయం ఇవ్వాలి. ఎంహెచ్ఆర్ఏ సలహా మేరకే నిర్ణయం తీసుకుంటాం’ అని ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ జనవరి నాలుగో తేదీన అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ మీడియా తాజాగా వెల్లడించింది. వ్యాక్సిన్ పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే రెండు వారాల్లోనే దాదాపు 20లక్షల మందికి ఆక్స్ఫర్డ్ లేదా ఫైజర్ వ్యాక్సిన్ను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు అక్కడి వార్త సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్ 70శాతానికి పైగా సమర్థత కలిగినట్లు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో ఇదివరకే వెల్లడించాయి. మరోవైపు కొత్తరకం వైరస్ విజృంభణ కొనసాగడం, యూకేలో వైరస్ తీవ్రత మరింత పెరిగిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే ఆక్స్ఫర్డ్ టీకాకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
యూకే నిర్ణయం వైపే భారత్ చూపు..
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భారత్లోనూ జరుగుతోన్న విషయం తెలిసిందే. వీటిని భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమాచార విశ్లేషణ అనంతరం బ్రిటన్ నియంత్రణ సంస్థలు తీసుకునే నిర్ణయం కోసమే భారత్ నియంత్రణ సంస్థలు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్రిటన్లో వ్యాక్సిన్కు అనుమతి అభించిన వెంటనే భారత్లోని నియంత్రణ సంస్థ సీడీఎస్సీఓ కూడా వ్యాక్సిన్ సమాచార విశ్లేషణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి..
భారత్లో ఈ వ్యాక్సిన్కే తొలి అనుమతి?
మోడెర్నా టీకాతో అమెరికా వైద్యుడికి అలర్జీ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతిలో కర్ణాటకలో విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు. -
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు