జాబ్ పోయింది.. ఆ కార్మికులకు నెలకు ₹15వేలు చొప్పున ఇవ్వండి!
మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో అనేక మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని, వారందరికీ నెలకు రూ.15వేలు .......
గోవా సీఎంకు ఏఐటీయూసీ విజ్ఞప్తి
పనాజీ: మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో అనేక మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని, వారందరికీ నెలకు రూ.15వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని గోవా ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) కోరింది. గోవాలో 88 కంపెనీలకు 2015లో ఇచ్చిన ఇనుప ఖనిజం మైనింగ్ లీజులకు రెండోసారి రెన్యువల్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో 2018లో గోవాలో మైనింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ఆయా గనుల్లో యంత్ర పరికరాలను తొలగించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కూడా లీజు సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో మైనింగ్ కార్మికుల సర్వీసు తొలగింపును ఎదుర్కొన్నట్లయితే.. నిరుద్యోగం, జీవనోపాధి, వారి కుటుంబాల అస్తిత్వానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని సీఎం ప్రమోద్ సావంత్కు ఇచ్చిన వినతిపత్రంలో ఏఐఈయూసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో లీజు సంస్థలు ఇప్పటికే కార్మికుల సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పేశాయన్నారు. రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను శాస్త్రీయ పద్ధతిలో తక్షణమే పునరుద్ధరించాలని ఏఐటీయూసీ -గోవా విభాగం సీఎంకు విజ్ఞప్తి చేసింది. అలాగే, ఉపాధి కోల్పోతున్న మైనింగ్ కార్మికులందరికీ నెలకు రూ.15వేలు చొప్పున చెల్లించేలా నిధులు కేటాయించాలని కోరింది.
మరోవైపు, రాష్ట్రంలో ఇనుప ఖనిజం తవ్వకాలను ప్రభుత్వరంగ మైనింగ్ కార్పొరేషన్ల ద్వారా త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఆ విషయంలో నేటికీ ఎలాంటి పురోగతిలేదని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా వేలం నిర్వహిస్తే కొత్తగా వచ్చే లీజు కంపెనీలు కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కార్మికులు చివరగా తీసుకొంటున్న వేతనాలు, సర్వీసును కొనసాగించేలా ప్రభుత్వం చూడాలన్నారు. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారి ప్రయోజనాలకనుగుణంగా గోవా లేబర్ బోర్డు పథకానికి అనుగుణంగా ఓ కొత్త పథకాన్ని తీసుకురావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.