మావోల చెరలో జవాన్‌.. కాసేపట్లో విడుదల? 

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌....

Updated : 08 Apr 2021 16:55 IST

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ మరికొద్ది గంటల్లో విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. ఆ జవాన్‌ను వదిలేస్తామని మధ్యాహ్నం 3.45గంటలకు మావోయిస్టులు సమాచారమిచ్చారు. జవాన్‌ కోసం ఓ  మాజీ నక్సలైట్‌ అడవిలోకి వెళ్లి వెనక్కి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం 6.30 గంటల తర్వాత జవాన్‌ను విడుదల చేయవచ్చని సమాచారం. బీజాపూర్‌ దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ మావోయిస్టులకు చిక్కిన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా వారి చెరలోనే ఉన్నారు. ఆ జవాన్‌ తమ వద్ద సురక్షితంగానే ఉన్నట్టు తెలుపుతూ మావోయిస్టులు ఆయన ఫొటో విడుదల చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని