కరోనాపై పోరు: మోదీకి మాజీ ప్రధాని సూచనలు
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ పలు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మే 2న నాలుగు రాష్ట్రాలు.....
బెంగళూరు: దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ పలు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మే 2న నాలుగు రాష్ట్రాలు/ ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయోత్సవ వేడుకలను అదుపుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, దేశంలో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఆర్నెల్ల పాటు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్నెల్ల వరకూ భారీ బహిరంగ సభలనూ నిషేధించాలన్నారు. ఈ కాలంలో ఎన్నికల సంఘం కూడా సురక్షితంగా ఎన్నికలు నిర్వహించేలా కొత్త నిబంధనల్ని తయారు చేసుకోగల్గుతుందన్నారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు. కరోనాకు కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతం, ప్రజల కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్మాణాత్మక నిర్ణయాలు, చర్యలకు తన మద్దతు ఉంటుందని దేవెగౌడ పేర్కొన్నారు.
* మహమ్మారిపై పోరాటంలో వేగంగా పనిచేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య వ్యవస్థ, కొవిడ్ నియంత్రణ వ్యవస్థను వికేంద్రీకరించాలి.
* కొవిడ్ నియంత్రణకు రాష్ట్రాల స్థాయిలో రాజధాని నగరాల్లో ఉన్న వార్ రూమ్లు సరిపోవు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వార్ రూమ్లను ఏర్పాటు చేయాలి.
* పెద్ద నగరాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నగరాల్లోనే కాకుండా మిగతా జిల్లాలు, తాలుకా కేంద్రాల్లో వైరస్ ప్రమాదం అధికంగా ఉంది. గ్రామస్థాయి క్లస్టర్లపైనా ఎక్కువ దృష్టి సారించడం అవసరం.
* ఈ పోరాటంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖలను రంగంలోకి దించి సమన్వయం చేసుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో కేవలం వైద్యశాఖ మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖల పాత్ర ఎంతో కీలకం.
* సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వ్యాక్సినేషన్పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. రెండు డోసులు వేసుకున్నా కొందరు వైరస్ బారిన పడుతుండటంతో ప్రజల్లో దీనిపై కొంత ఆందోళన ఉంది. ఈ సమయంలో టీకాలు వేసుకున్న వారితో పాటు మిగతా వారి ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించాలి.
* టీకా నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వాసం ఏర్పడిన తర్వాతే వ్యాక్సినేషన్పై ప్రజలకు డెడ్లైన్లు విధించాలి. టీకా పంపిణీ పెద్ద ఎత్తున జరిగేందుకు ప్రజా ప్రతినిధులందరికీ నియోజకవర్గాల వారీగా టార్గెట్లు ఇవ్వాలి.
* టీకా ధరలపైనా గందరగోళం నెలకొంది. పేదలను దృష్టిలో పెట్టుకొని ధరలను నిర్ణయించాలి. ఒకవేళ ప్రభుత్వం పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయిస్తే అదో గొప్ప మానవీయ కార్యక్రమంగా నిలుస్తుంది.
* కరోనాపై పోరాటంలో ముందుండి పనిచేస్తున్న కొవిడ్ వారియర్లు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
* రాష్ట్రాల మధ్య సమన్వయం చేసుకొనేందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యేక కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టుకోవాలి. కరోనా వైరస్కు రాజకీయ పక్షపాతం ఉండదు. రాజకీయాలకతీతంగా ఈ వైరస్పై దేశమంతా యుద్ధం చేయాలి.
* దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్య మౌలిక వసతులను మెరుగుపరుచుకొనేలా తక్షణమే చర్యలు ప్రారంభించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు