G20 : బైడెన్, జిన్పింగ్ సహా జీ20 అతిథుల కోసం దిల్లీలో భారీగా ఏర్పాట్లు..
దిల్లీలో జీ20 సదస్సు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 30 స్టార్ హోటళ్లను ఇప్పటికే అతిథుల కోసం బుక్ చేశారు. జోబైడెన్, జిన్పింగ్, రిషి సునాక్, మేక్రాన్ వంటి దిగ్గజ నేతలు హాజరుకానున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: వచ్చే నెల 9వ తేదీ నుంచి రెండు రోజులపాటు దిల్లీలో జరగనున్న జీ 20 (G20) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అతిథుల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని దాదాపు 30 హోటళ్లను వీరి ఆతిథ్యం కోసం బుక్ చేశారు.
ఆ ఆత్మహత్యలు నన్ను ఎంతగానో కలచివేశాయి: ‘సూపర్ 30’ ఆనంద్ కుమార్
వీటిలో దిల్లీ నగరంలోని ఐటీసీ మౌర్యా, తాజ్ మాన్సింగ్, తాజ్ ప్యాలెస్, హోటల్ ఒబెరాయ్, హోటల్ లలిత్, ది లోధీ, మెరిడీయన్, హయత్ రీజెన్సీ, షంగ్రి లా, లీలా ప్యాలెస్, హోటల్ అశోక, ఎరోస్ హోటల్, ది సూర్యా, రాడిసన్ బ్లూ ప్లాజా, జేడబ్ల్యూ మారియట్, ది లీలా యాంబియన్స్ కన్వెన్షన్, ది ఇంపీరియల్ తదితర హోటళ్లు ఉన్నాయి. ఇక ఎన్సీఆర్ పరిధిలోని వివంత, ఐటీసీ గ్రాండ్, తాజ్ సిటీ సెంటర్ హయత్ రీజెన్సీ (గురుగ్రామ్) ది ఒబెరాయ్ తదితర హోటళ్లున్నాయి.
ఐటీసీ మౌర్యాలో బైడెన్ బస
ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం ఐటీసీ మౌర్యాలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) బస చేయనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ హోటల్ 14 వ అంతస్తులో బైడెన్ బస చేసే గది ఉంది. ఆ ఫ్లోర్ చేరడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ హోటల్లో 400 గదులను అతిథుల కోసం బుక్ చేశారు. ఇక హోటల్ షంగ్రి-లాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, క్లారిడ్జెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇంపీరియల్ హోటల్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆతిథ్యం స్వీకరించనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సదస్సుకు హాజరైతే తాజ్ ప్యాలెస్లో ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. ఇదే హోటల్లో బ్రెజిల్ నుంచి వచ్చే అతిథులు కూడా ఉంటారు. దిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో తుర్కియే దౌత్య బృందాలు బసచేయనున్నాయి. మారిషస్, నెదర్లాండ్స్, నైజిరీయా, స్పెయిన్ బృందాలు లా మెరీడియన్ హోటల్లో ఉండనున్నాయి. ఇప్పటికే యూకే, అమెరికా, చైనా నుంచి లైజనింగ్ బృందాలు భారత్కు చేరుకొన్నాయి.
విదేశీ అతిథుల రక్షణకు ఎన్ఎస్జీ..
విదేశీ అతిథుల రక్షణ బాధ్యతలను సెంట్రల్ పారామిలటరీ, ఎన్ఎస్జీ కమాండో, దిల్లీ పోలీస్ బృందాలు చూసుకొంటున్నాయి. వీటిల్లో ఒక్కో బృందానికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడన్ కూడా దిల్లీకి రానుండటంతో ఆ దేశానికి చెందిన సీక్రెట్ సర్వీస్ బృందాలు కూడా మూడు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేయనున్నాయి. ఇప్పటికే హోంశాఖ జీ-20 సదస్సు భద్రతపై పలు సమీక్షా సమావేశాలు నిర్వహించింది. అతిథుల రక్షణ బాధ్యతలను చూసుకోవడంపై సీఆర్పీఎఫ్లోని 1,000 మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు