ప్రతి 8గంటలకు ఆరు కొత్త కేసులు
దేశంలో కొవిడ్-19 కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైందని వెల్లడించింది. భారత్లో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు ఇదేనని....
100 కేసులు నమోదయ్యాక ఇదే అత్యల్ప వృద్ధిరేటు
ఊపందుకున్న టెస్టు కిట్లు, పీపీఈ, ఎన్95 మాస్క్ల తయారీ
అత్యున్నత స్థాయి కేంద్ర మంత్రుల కమిటీ వెల్లడి
దిల్లీ: దేశంలో కొవిడ్-19 కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైందని వెల్లడించింది. భారత్లో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు ఇదేనని పేర్కొంది. కొవిడ్-19పై కేంద్ర వైద్యమంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత స్థాయి మంత్రుల కమిటీ 13వ సమావేశం శనివారం జరిగింది.
దేశంలోని కొవిడ్-19 ఆస్పత్రుల్ని రాష్ట్రాల వారీగా మంత్రుల కమిటీ వివరించింది. ఐసోలేషన్ పడకలు, వార్డులు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్లు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సీజన్ సిలిండర్ల వివరాలను వెల్లడించింది. గతంలో గుర్తించిన దేశీయ తయారీదారులు పీపీఈ కిట్లు, మాస్క్ల తయారీని ఆరంభించాయని పేర్కొంది. అన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపింది.
‘దేశం ప్రతి రోజు లక్ష కన్నా ఎక్కువగా పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్లు తయారవుతున్నాయి. 104 సంస్థలు పీపీఈలు, మూడు సంస్థలు ఎన్95 మాస్క్లు తయారు చేస్తున్నాయి. దేశీయ సంస్థలు వెంటిలేటర్ల ఉత్పత్తి ఆరంభించాయి. తొమ్మిది సంస్థల్లో 59వేలకు పైగా ఆర్డర్ చేశాం’ అని కమిటీ వెల్లడించింది.
‘ప్రస్తుతం కొవిడ్-19 మరణాల రేటు 3.1 శాతంగా ఉంది. కోలుకుంటున్న వారి శాతం 20 కన్నా ఎక్కువగా ఉంది. చాలా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంది. లాక్డౌన్, క్లస్టర్ నిర్వహణ, కట్టడి వ్యూహం ఫలితంగానే ఇది సాధ్యమైంది. సగటున 9.1 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటివరకు 20.66 శాతం రేటుతో 5,062 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి 1429 కేసులు నమోదయ్యాయి’ అని మంత్రుల కమిటీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 24,506 కేసులు నమోదవ్వగా 775 మంది మరణించారు.
ప్రభుత్వ, ప్రైవేటు ప్రయోగశాలల్లో నమూనాల పరీక్ష, వ్యూహం గురించి కమిటీ వివరించింది. దేశంలో కొవిడ్-19 గురించి వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చింది. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యల గురించి వివరించింది. జిల్లాలు అత్యవసర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా వలస కూలీలకు 92వేల స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, సామాజిక సంస్థలు ఆహారం అందిస్తున్నాయని వెల్లడించింది.
ఆరోగ్య కార్యకర్తలు, ఎన్ఎస్ఎస్, ఎన్వైకే, ఎన్సీసీ, వైద్యుల జాతీయస్థాయి మెటాడాటాను రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో పంచుకున్నామని మంత్రుల కమిటీ తెలిపింది. అవసరమైనప్పుడు వాలంటీర్లను మోహరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. 1.24 కోట్ల మందికి సంబంధించిన సమాచారం డ్యాష్బోర్డులో ఉందని, నిరంతరం దానిని అప్డేట్ చేస్తున్నామని వెల్లడించింది. ఈ కొవిడ్ వారియర్లు ఆరోగ్య శాఖ వెబ్సైట్, ఐగాట్ శిక్షణ పోర్టల్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా శిక్షణ పొందారని తెలిపింది.
పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, రసాయనాలు, ఎరువుల సహాయమంత్రి మన్సుఖ్ మండవీయ, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర