ఇన్ఫ్లుయెంజాతో జాగ్రత్త: కేంద్రం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా సంబంధ అనారోగ్యం(ఐఎల్ఐ)వ్రమైన శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్(ఎస్ఏఆర్ఐ) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్భూషణ్ హెచ్చరించారు.
ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా సంబంధ అనారోగ్యం(ఐఎల్ఐ)వ్రమైన శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్(ఎస్ఏఆర్ఐ) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్భూషణ్ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాశారు. ‘‘ఇన్ఫ్లుయెంజా ఏటా సీజనల్గా వస్తుంది. ప్రస్తుత సీజన్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండటం, ప్రజల జీవనశైలిలో మార్పులు రావడం (తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎదుటివారికి సమీపంలో తుమ్మడం, దగ్గడం, ఇరుకు స్థలాల్లో ఎక్కువమంది గుమికూడటం), మరోవైపు ఇన్ఫ్లుయెంజా ఎ (హెచ్1ఎన్1, హెచ్3ఎన్2), ఎడినోవైరస్లు వేగంగా వ్యాప్తిచెందడానికి అనుకూలంగా వాతావరణం మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐఎల్ఐ/ఎస్ఏఆర్ఐ తీవ్రత పెరుగుతూ వస్తోంది. డిసెంబరు రెండో పక్షం నుంచి హెచ్3ఎన్2 ప్రభావం పెరగడం ప్రారంభమైంది. చిన్నారులు, వయోవృద్ధులు, రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు ఉన్న వారికి హెచ్1ఎన్1, హెచ్3ఎన్2, అడినోవైరస్లు సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కొవిడ్ ప్రభావం చెప్పుకోదగ్గస్థాయిలో తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పాజిటివిటీ రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని వెంటనే అరికట్టాలి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ దీని వ్యాప్తిపై నిఘా ఉంచడంతోపాటు టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నియంత్రణకు అనువైన నిబంధనలను అనుసరించాలి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఐసీఎంఆర్ వీఆర్డీఎల్ నెట్వర్క్ ల్యాబ్ ద్వారా సేకరించి పరీక్షించిన నమూనాల్లో 25.4% మేర అడినోవైరస్ పాజిటివ్ వచ్చింది. దీనివల్ల శ్వాసకోశ సంబంధమైన ఇన్ఫెక్షన్తోపాటు జ్వరం, దగ్గు లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వయోవృద్ధులు, స్థూలకాయులు, దీర్ఘకాలంగా శ్వాససంబంధమైన ఇబ్బందులు, మధుమేహం, గుండె సమస్యలు, దీర్ఘకాల కిడ్నీ, లివర్ సమస్యలున్నవారు, గర్భిణులు దీనివల్ల ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకొనేలా అప్రమత్తంచేయాలి. దగ్గు, తుమ్ము, చీదేటప్పుడు మొహానికి చేతులు లేదా టిష్యూనో అడ్డుగాపెట్టుకోవాలని, బహిరంగప్రాంతాల్లో ఉమ్మడం ఆపాలని చెప్పాలి. మాస్కులు పెట్టుకోవడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడాన్ని ప్రోత్సహించాలి. అన్ని రాష్ట్రాలూ ఐఎల్ఐ వ్యాప్తిని పరిశీలించాలి. ఇన్ఫ్లుయెంజా, కొవిడ్, అడినోవైరస్లను గుర్తించేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ నమూనాలను పరీక్షలకోసం ల్యాబ్లకు పంపాలి. ఆసుపత్రుల్లోని పరిస్థితులను సమీక్షించి మందులు, వైద్యపరికరాలు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేలా మానవ వనరులకూ తగిన శిక్షణ ఇప్పించాలి’’ అని రాజేష్భూషణ్ ఈ లేఖలో రాష్ట్రాలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. -
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
భారత్లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని ఎన్సీబీ భగ్నం చేసింది. -
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
రాజులు, మహారాజులను అవమానించిన రాహుల్ గాంధీ.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని ప్రధాని మోదీ విమర్శించారు. -
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
దేవెగౌడ కంచుకోట అయిన హసన్ ఎంపీ సెగ్మెంట్ బరిలో ఉన్న ఆయన మనవడు రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. ఆయనపై అసభ్యకర వీడియోలు ప్రచారంలోకి వచ్చిన వేళ ఈ పరిణామం చోటు చేసుకొంది. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
సోషల్ మీడియా ట్రోలర్ల వికృత రూపం మరోసారి బయటపడింది. పదో తరగతిలో స్టేట్ టాపర్గా నిలిచిన బాలికను వారు వేధించారు. ఒక దశలో కొన్ని మార్కులు తగ్గినా బాగుండు అని ఆమె అనుకొనేలా చేశారు. చివరికి నెటిజన్లు, నాయకులు ఆమెకు అండగా నిలవడంతో ధైర్యం తెచ్చుకొని భవిష్యత్తుపై దృష్టిపెడతానని పేర్కొంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్కు సిట్ అధికారులు డిసెంబరులోనే సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!