రాహుల్కు రెండేళ్ల జైలు
ప్రధాని నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేరీతిలో వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’
మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు తీర్పు
అప్పీలుకు 30 రోజుల గడువు.. అప్పటివరకు శిక్ష నిలిపివేత
సూరత్: ప్రధాని నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేరీతిలో వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని 2019లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ గురువారం తీర్పు వెలువరించారు. ‘‘నిందితుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రజల్లో ఆయన చేసే ప్రసంగాలకు ప్రభావం ఎక్కువ. నిందితుడికి స్వల్పశిక్ష విధిస్తే అది ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తుంది. ఎవరు ఎవరిపైనైనా సులువుగా అపనింద వేస్తారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని గతంలో నిందితుడు వ్యాఖ్యానించి, క్షమాపణలు చెప్పిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఇకపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అయినా ఆయన ప్రవర్తనలో మార్పేమీ ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్య ద్వారా పరువునష్టం కలిగించారని చెప్పారు.
కోర్టులోనే ఉన్న రాహుల్
తీర్పు వెలువడే సమయంలో రాహుల్ కూడా కోర్టులోనే ఉన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తన కర్తవ్యంలో భాగంగా ప్రసంగం చేశానని ఆయన కోర్టుకు చెప్పారు. తనకు ఎవరిపట్లా వివక్ష లేదన్నారు. ఎవరినీ అవమానించే ఉద్దేశం రాహుల్కు లేనందున స్వల్పశిక్ష మాత్రమే విధించాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. రాహుల్ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చింది. సత్యం, అహింసల గురించి మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని రాహుల్ ట్వీట్ చేశారు. దావా వేసిన భాజపా శాసనసభ్యుడు పూర్ణేశ్ మోదీ ఈ తీర్పును స్వాగతించారు.
ఇదీ కేసు నేపథ్యం
వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీల గురించి 2019 ఎన్నికల ప్రచారం వేళ కర్ణాటకలోని కోలార్లో రాహుల్ ప్రస్తావించారు. ఆ సందర్భంగా మోదీ అనే పేరు గురించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ పరువునష్టం దావా దాఖలైంది. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని కోర్టుకు రాహుల్ నివేదించినట్లు ఆయన తరఫు న్యాయవాది జిగ్నేష్ తెలిపారు. కేంద్రం జడ్జీలను మారుస్తున్నప్పుడే ఇలాంటి తీర్పు వస్తుందని తమకు తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
నేడు రాష్ట్రపతితో భేటీ
దిల్లీ: తమ అగ్రనేత రాహుల్గాంధీకి జైలుశిక్ష పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం పలు ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ కానుంది. ఈ మేరకు తమకు సమయం కేటాయించాల్సిందిగా ఆమెను కోరింది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలపనుంది. న్యాయపోరాటం చేయడంతో పాటు రాజకీయంగానూ ఉద్యమిస్తామని పార్టీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు. -
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!