జల్లికట్టు.. శతాబ్దాల సంప్రదాయం
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత చట్టానికి చేసిన సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.
తమిళనాడు సంస్కృతిలో భాగం కాదన్న వాదనను అంగీకరించం
ఈ క్రీడ చట్ట సమ్మతమే: సుప్రీం
దిల్లీ: తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత చట్టానికి చేసిన సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది. దీంతో పాటు.. దున్నలతో కర్ణాటక నిర్వహించే కంబళ పోటీకి, మహారాష్ట్ర సంప్రదాయ ఎడ్ల పందేలకు కూడా పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు చేసిన చట్ట సవరణలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ గురువారం జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్లు ధర్మాసనంలోని ఇతర సభ్యులు. 2017లో జంతు క్రూరత్వ నిరోధక చట్టాలకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర చేసిన సవరణలకు రాష్ట్రపతి అనుమతి కూడా లభించిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. తమిళనాడులో పొంగల్ సమయంలో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. కంబళ దున్నల పందేలను నవంబరు, మార్చి మధ్య కర్ణాటకలో జరుపుతారు.
‘‘మా ముందు ప్రవేశపెట్టిన ఆధారాలతో సంతృప్తి పొందాం. జల్లికట్టు తమిళనాడులో శతాబ్దాల సంప్రదాయం. మా పరిశీలనలో మూడు రాష్ట్రాలు చేసిన సవరణలు కూడా చెల్లుబాటయ్యే శాసనాలే’’ అని 56 పేజీల తీర్పులో న్యాయమూర్తులు పేర్కొన్నారు. జల్లికట్టు సంప్రదాయ క్రీడ కాదని పశువులను హింసకు గురిచేసే జల్లికట్టు, కంబళ తదితర క్రీడలనూ నిషేధించాలని 2014లో సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. దీంతో తమ రాష్ట్ర జంతు క్రూరత్వ చట్టాలకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక సవరణలు చేశాయి. వీటిని జంతు సంక్షేమ సంస్థలు సవాల్ చేశాయి. దీంతో పాటు 2014 సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయాలని పిటిషన్లు వేశాయి. దీనిపై రాజ్యాగం ధర్మాసనం ప్రస్తుత తీర్పు వెలువరించింది. జల్లికట్టు సంప్రదాయక్రీడ కాదనడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.‘‘తమిళనాడు చేసిన సవరణలోని నిబంధనల ప్రకారం.. పశువుల నొప్పిని గణనీయంగా తగ్గించి ఈ సంప్రదాయ క్రీడ కొనసాగేలా ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తుంది. సవరణకు రాష్ట్రపతి అనుమతి కూడా లభించింది. కాబట్టి రాష్ట్ర చర్యల్లో లోపం ఉందని మేం అనుకోవడం లేదు’’ అని ధర్మాసనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’