చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదు
చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. భాజపా నేత మనోజ్ సోంకార్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది.
ఆప్-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి పట్టం
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రిటర్నింగ్ అధికారిది దుర్మార్గ వైఖరి
కోర్టుకు అబద్ధాలు చెప్పారు
ఆయనను ప్రాసిక్యూట్ చేయండి
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం
దిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. భాజపా నేత మనోజ్ సోంకార్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఎన్నికైనట్లుగా ప్రకటించింది. బ్యాలెట్ పేపర్లను ఏమార్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది. ఆయన దుర్మార్గంగా వ్యవహరించారని, అబద్ధాలు చెప్పారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ధర్మాసనంలో జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ఉన్నారు. ‘జనవరి 30వ తేదీన జరిగిన మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారు. ఆయనది దుష్ప్రవర్తనే. అయితే ఎన్నిక మొత్తాన్ని రద్దు చేయడం లేదు. జరిగిన తప్పులను సరిదిద్దుతున్నాం. కుల్దీప్ కుమార్కు పోలైన ఓట్లలో చెల్లనివిగా పేర్కొన్న 8 ఓట్ల అంశంలో చోటుచేసుకున్న తప్పిదాలను సవరిస్తున్నాం. ఈ విషయంలో మసీహ్ ఉద్దేశపూర్వకంగా 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘అనిల్ మసీహ్ రెండు అంశాల్లో తప్పులు చేశారు. మొదటిది.. చట్ట విరుద్ధంగా మేయర్ ఎన్నికలను తారుమారు చేశారు. రెండోది.. సుప్రీంకోర్టు ఎదుట సోమవారం తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఆయన బాధ్యత వహించాల్సిందే. ప్రిసైడింగ్ అధికారిగా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం ఎదురయ్యే పర్యవసానాల గురించి ఆయన నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉండాల్సింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేశారని పేర్కొంటూ 8 ఓట్లను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తిరస్కరించారు. దీంతో 16 ఓట్లు వచ్చిన మనోజ్ సోంకార్ విజయం సాధించారు. ఆప్, కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు 12 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం భాజపా అభ్యర్థి ఎన్నికను రద్దు చేసింది. కుల్దీప్ కుమార్ను చండీగఢ్ మేయర్గా ప్రకటించింది. విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను ధర్మాసనం పరిశీలించింది. ‘ఈ బ్యాలెట్ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా..’ అంటూ మసీహ్ను ప్రశ్నించింది. ‘అవి ఆప్ అభ్యర్థికి వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు’ అని సీజేఐ పేర్కొన్నారు. ఆ పేపర్లను కోర్టులోని ఇరుపక్షాల న్యాయవాదులకు చూపించారు. మసీహ్ చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజేఐ.. లెక్కింపు వీడియోను మరోసారి చూశారు. ‘అందరినీ ఈ వీడియో చూడనివ్వండి. జీవితంలో వినోదం మంచిదే. అయితే కౌంటింగ్ వీడియో మొత్తం చూడాల్సిన పనిలేదు. అంతా వేస్తే సాయంత్రం 5.45 గంటల వరకూ ఇక్కడే ఉంటాం’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
సుప్రీంకు కృతజ్ఞతలు: కేజ్రీవాల్
క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు రక్షించిందని ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకున్నందుకు మంగళవారం ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మరింత దూరం ప్రయాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు. -
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత