మిరామ్ తరోన్ ‘కిడ్నాప్’.. చైనా బలగాలతో ఆర్మీ సంప్రదింపులు..!
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల కుర్రాడిని చైనా సైనికులు కిడ్నాప్ చేసినట్లు వస్తోన్న వార్తలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ ఉదంతంపై ప్రతిపక్షాల నుంచి
దిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల కుర్రాడిని చైనా సైనికులు కిడ్నాప్ చేసినట్లు వస్తోన్న వార్తలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ ఉదంతంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. అదృశ్యమైన యువకుడి కోసం చైనా బలగాలతో హాట్లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణశాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి.
అసలేం జరిగిందంటే..
అప్పర్ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు మిరామ్ తరోన్ను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు అపహరించుకుని వెళ్లినట్లు అరుణాచల్ తూర్పు ఎంపీ తాపిర్ గావో బుధవారం ట్విటర్లో వెల్లడించారు. సాంగ్పో నది (ఈ నదిని అస్సాంలో బ్రహ్మపుత్రగా పిలుస్తారు) అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించే చోట మంగళవారం ఈ ఘటన జరిగిందని చెప్పారు. మిరామ్తో పాటే ఉన్న అతడి స్నేహితుడు జానీ యాయింగ్ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఎంపీ ట్విటర్లో పేర్కొన్నారు. చైనా చర్య గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశానని.. మిరామ్ను త్వరగా విడిపించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని తాపిర్ విజ్ఞప్తి చేశారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను ‘అదృశ్యం’గా పేర్కొనడం గమనార్హం. వాస్తవాధీన రేఖ సరిహద్దుల్లో మూలికలు సేకరించడంతో వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
చైనాను సంప్రదించాం..
ఘటనపై రక్షణ మంతిత్వ శాఖ వర్గాలు స్పందించాయి. ‘‘అరుణాచల్ ప్రదేశ్లోని భారత సరిహద్దుల్లో యువకుడి అదృశ్యం గురించి సమాచారం తెలియగానే.. భారత ఆర్మీ హాట్లైన్ ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులను సంప్రదించింది. వేటకు వచ్చిన ఓ యువకుడు దారి తప్పి కన్పించకుండా పోయిన విషయాన్ని చైనా బలగాలకు చేరవేశాం. యువకుడి ఆచూకీ కనుగొని ప్రోటోకాల్స్ ప్రకారం అతడిని భారత్కు అప్పగించాలని కోరాం’’ అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
మోదీకి పట్టడం లేదా..?: రాహుల్ గాంధీ
‘మిరామ్ తరోన్ ‘కిడ్నాప్’ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘‘గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు ఓ యువకుడిని చైనా కిడ్నాప్ చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మిరామ్ కుటుంబానికి మేం అండగా ఉంటాం. విశ్వాసం కోల్పోవద్దు. ఓటమిని అంగీకరించొద్దు’’ అని రాహుల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఘటనపై మోదీ మౌనంగా ఉన్నారంటే దానర్థం.. ఆయనకు ఏం పట్టడం లేదా? అంటూ దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది. -
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం. -
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
అమిత్ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్ (Twitter)తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. -
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్