Ramesh Bidhuri: బీఎస్పీ ఎంపీపై కామెంట్స్.. పార్టీ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీస్
Speaker warns Ramesh Bidhuri: బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిపై భాజపా ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
దిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ దిల్లీకి చెందిన భాజపా ఎంపీ రమేశ్ బిధూరీ (Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ(BSP)కి చెందిన ఎంపీ డానిష్ అలీపై (Danish Ali) లోక్సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. ఆయనను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం రమేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. భాజపా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
గురువారం చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని అభ్యంతరకర పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలను ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించారు. బిధూరీ వ్యాఖ్యల పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ‘‘డానిష్ అలీ గురించి బిధూరీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఇలాంటి పదజాలం ఇంతకుముందెన్నడూ వినలేదు. పార్లమెంట్ కొత్త భవనం ఇలాంటి మాటలతో ప్రారంభం కావడం బాధాకరం. బిధూరీ వ్యాఖ్యలు భాజపా ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.
EVM సోర్స్కోడ్పై ఆడిట్ నిర్వహించాలని పిల్.. నిరాకరించిన సుప్రీం కోర్టు
ఓబీసీలను, ముస్లింలను అవమానించడం భాజపా సంస్కృతిలో భాగమని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ముస్లిం ఎంపీ పట్ల భాజపా ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దేశంలోని గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. ప్రధాని ఆదేశానుసారమే పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీపై భాజపా సభ్యుడు అసభ్య పదజాలం వినియోగించడం తీవ్ర అభ్యంతకరమని పేర్కొన్నారు.
స్పీకర్ సీరియస్.. పార్టీ షోకాజ్ నోటీసులు
ఎంపీ వ్యాఖ్యల పట్ల స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు అధికార వర్గాల తెలిపాయి. ఈ వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తంచేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు డానిష్ అలీ లేఖ రాశారు. అభ్యంతరక పదజాలాన్ని వినియోగించడం పట్ల భాజపా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
- మరోవైపు రమేశ్ బధూరీ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న భాజపా నేత హర్షవర్దన్.. నవ్వుతూ కనిపించడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రమేశ్ ఏం మాట్లాడారో తనకు సరిగా వినిపించలేదని, తనకు సంబంధం లేకపోయినా కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారంటూ పోస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bengaluru: విద్యార్థులకు మళ్లీ ఉచిత సైకిళ్లు.. సీఎంతో చర్చిస్తా: మంత్రి
పాఠశాలల్లో డ్రాపౌట్ రేటును తగ్గించడమే లక్ష్యంగా ఉచిత సైకిళ్లు పంపిణీపై డిమాండ్లు వస్తున్న వేళ కర్ణాటక విద్యాశాఖ మంత్రి స్పందించారు. -
ఖతార్లో 8మందికి మరణశిక్ష కేసు.. బాధితులతో భారత రాయబారి భేటీ
ఖతార్లో 8 మంది భారతీయులకు మరణశిక్ష కేసు, ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు వంటి పలు అంశాలపై విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. -
ISRO: ప్రయోగాల పరంపర.. 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
ISRO 2024లో కీలకమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు తెలిపారు. -
Congress: ముందైతే ఒక యాపిల్ తీసుకురండి.. నెహ్రూపై షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారణమంటూ కేంద్రమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల్లోపు పీవోకేను వెనక్కి తీసుకురావాలంటూ డిమాండ్ చేసింది. -
Kerala: సీఎం vs గవర్నర్.. కేరళలో మరోసారి మాటల యుద్ధం
CM vs Governor: కేరళలో రాజ్భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం మరింత పెరుగుతోంది. తాజాగా సీఎం, గవర్నర్ మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. -
Chennai Rains: మోదీ ఆందోళన చెందారు.. పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు: రాజ్నాథ్
తుపాను బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. -
General Anil Chauhan: సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికత అవసరం: సీడీఎస్
దేశ భద్రతను పటిష్ఠ పరిచేందుకు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. -
Bihar: అది చాయ్ సమోసా మీటింగే.. ఇండియా కూటమిపై జేడీయూ నేత వ్యంగ్యాస్త్రాలు
ఇండియా కూటమి సమావేశాలను ప్రస్తావిస్తూ జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ పింటు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కూటమి సమావేశాలను చాయ్ సమోసా మీటింగ్లంటూ ఎద్దేవా చేశారు. -
Live-in relation: సహజీవనం ‘ప్రమాదకరమైన జబ్బు’.. లోక్సభలో భాజపా ఎంపీ
సహజీవనం (Live-in relationship) ఓ ‘ప్రమాదకరమైన జబ్బు’ అని.. దాన్ని సమాజం నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఉందని భాజపా ఎంపీ ధరంవీర్ సింగ్ పేర్కొన్నారు. -
India-USA: ‘ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు’: భారత్-అమెరికా రిలేషన్షిప్పై గార్సెట్టి వ్యాఖ్య
భారత్-అమెరికా(India-USA) కలిసి ఉండటానికి చైనా కారణం కాదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వివరించారు. 95 శాతం ఇతర కారణాలతోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు విస్తరిస్తున్నాయని చెప్పారు. -
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
డీప్ఫేక్ ఉచ్చులో ప్రియాంకా చోప్రా
డీప్ఫేక్ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. -
గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
భారత పార్లమెంటుపై దాడి చేస్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. -
మెహుల్ చోక్సీ దంపతులపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పరారైన వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి
అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్లో అసంబద్ధ విధానాలు
సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్కు మారుస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. -
యునెస్కో జాబితాలో గర్బా నృత్యం
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. -
100కు పైగా మోసకారి వెబ్సైట్ల మూసివేత
చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. -
అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు 7వేల మందికి ఆహ్వానం
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది.


తాజా వార్తలు (Latest News)
-
janasena: ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను: పవన్
-
TS Cabinet: ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన తెలంగాణ కేబినెట్
-
SRH-IPL 2024: రచిన్ కోసం ఎస్ఆర్హెచ్ భారీ మొత్తం పెట్టొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
ఖతార్లో 8మందికి మరణశిక్ష కేసు.. బాధితులతో భారత రాయబారి భేటీ
-
EC: లోక్సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఈసీ
-
Ghaziabad: అతిథులకు ట్రే తగిలిందని ఘాతుకం..వెయిటర్ను చంపి అడవిలో పడేసి..!