INDIA: ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే? పలువురి నేతల ప్రతిపాదన!
దిల్లీ జరిగిన ఇండియా కూటమి నేతల భేటీ ముగిసింది. ఈ భేటీలో పలువురు నేతలు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది.
దిల్లీ: దేశ రాజధాని నగరంలోని అశోకా హోటల్లో జరిగిన విపక్ష కూటమి ఇండియా (INDIA) నాలుగో సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కీలక భేటీలో పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలతో పాటు రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. అయితే, ఇండియా కూటమి ప్రధాన మంత్రి(Prime Minister) అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. ‘తొలుత సమష్టిగా పోరాడదాం.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దాం’ అని చెప్పినట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తాజాగా జరిగిన విపక్షాల కూటమి ‘ఇండియా’ భేటీ ముగిసిన అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 విపక్ష పార్టీల నేతల సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా కనీసం 8 నుంచి 10 సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
22న దేశవ్యాప్త నిరసనలు
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని తాము కోరుతుంటే.. పార్లమెంటులో వారు ఎందుకు మాట్లాడటం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్పై డిసెంబర్ 22న దేశ వ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలు రాష్ట్ర స్థాయిల్లోనే జరుగుతాయని.. అక్కడ ఏదైనా సమస్య ఉంటే కేంద్ర స్థాయిలో చర్చిస్తామన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, బిహార్, యూపీ, దిల్లీ లేదా పంజాబ్ ఎక్కడైనా సరే సీట్ల పంపకంలో సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.
జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకం ఖరారు!
జనవరి రెండో వారం లోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఖర్గే చెప్పారు. ‘ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి మీరేనా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ.. తొలుత తాము గెలిచి మెజార్టీ సాధించాలని.. ఆ తర్వాతే ఎంపీలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్, కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe) బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు జరిపింది. -
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
మధ్యప్రదేశ్లో బయటపడిన నర్సింగ్ కాలేజీ స్కామ్కు సంబంధించి దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులే అవినీతికి పాల్పడినట్లు వెల్లడైంది. -
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని భాజపా సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. -
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషినని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలున్నాయని భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ (Brij Bhushan) వెల్లడించారు. -
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి
ల్యాండింగ్కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఢీకొని 30కి పైగా ఫ్లెమింగో పక్షుల గుంపు మృతి చెందింది. -
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
Pune Car Crash: ఓ బాలుడి ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరు మృతి చెందిన ఘటనలో నిందితుడైన మైనర్ బాలుడికి పోలీసులు స్టేషన్లో సకల మర్యాదలు చేసినట్లు తెలుస్తోంది. అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు సమాచారం. -
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
స్వాతీ మాలీవాల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ను నేడు దిల్లీ పోలీసులు ముంబయికి తీసుకెళ్లారు. -
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం
Deepfake Photos: ఏఐతో సృష్టించిన డీప్ఫేక్ ఫొటోలను గుర్తించేందుకు కొన్ని టిప్స్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఓ ట్యుటోరియల్ వీడియోను విడుదల చేసింది -
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఏంటా ఫొటో? ఎందుకంత స్పెషల్? -
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
స్విగ్గీ (Swiggy)కి చెందిన ఒక డెలివరీ బాయ్ వీడియో ఆన్లైన్ చక్కర్లు కొడుతోంది. దానిపై డెలివరీ యాప్ కూడా స్పందించింది. -
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
ఆప్ నేతలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన సొంత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
BJP: భాజపా ఎంపీ జయంత్ సిన్హా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో భాజపా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
భాజపా సీనియర్ నేత నోరుజారి ఇరకాటంలో పడ్డారు. తాను చేసిన పొరపాటుకు ప్రతిగా ఉపవాసం చేస్తానని చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుడమి గర్భాన ‘బొగ్గు’మన్న మంటలు!
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని ఖలారీ రేంజ్లో బొగ్గు గని నుంచి సోమవారం ఎగసిపడుతున్న అగ్నికీలలివి. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
దురుసు డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. -
చదవాల్సిన పుస్తకం!
మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్