Model Code of Conduct: అమల్లోకి ఎన్నికల కోడ్.. ఇంతకీ ఏమిటిదీ..?
Model Code of Conduct: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో కోడ్ అమల్లోకి వచ్చింది? ఏమిటీ ఎన్నికల కోడ్? ఎప్పటి వరకు ఉంటుంది?
Model Code of Conduct | ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct) లేదా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటారు. పలు సందర్భాల్లో నేతలు కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదులు వెళ్తుంటాయి. ఇంతకీ ఏమిటీ కోడ్? ఎందుకు ఇది ముఖ్యం?
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, నేతలు చేయాల్సినవి, చేయకూడనవి ఏంటనేది ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిర్దేశిస్తుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు గానూ ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని.. పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు.. ఫలితాలు వెలువడే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది.
ఏమిటా నియమాలు?
- కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదు.
- అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో గానీ, ఇతర మాధ్యమాల్లో గానీ ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు.
- మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు (బుగ్గ కార్లు), తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు.
- ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు.
- రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు. కానీ, వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే, కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియామావళికి వ్యతిరేకం.
- దేవాలయాలు, మసీదులు, చర్చిలు.. ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభం పెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి.
- కులాల మధ్య, మతాల మధ్య, వివిధ భాషలు మాట్లాడే వారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్ ఉల్లంఘనే అవుతుంది.
- రాత్రి 10 తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
- రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా మ్యానిఫెస్టో ఉండకూడదు. పార్టీలు ఇచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి.
- ఎన్నికల పోలింగ్కు 48 గంటల ముందు తమకు ఓటేయాలంటూ ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్కు ముందు ఓటర్లను ప్రభావితం చేయూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిబంధన విధించింది.
- పోలింగ్ తేదీ రోజు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు.
- సాధారణంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువ. ఎన్నికల సమయంలో పార్టీలు నగదు తరలించడానికి వేర్వేరు మార్గాలను అనుసరిస్తుంటాయి. కోడ్ సమయంలో ఒకవేళ పౌరులు అధిక మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే.. వాటికి సంబంధించిన బిల్లులను వెంట తీసుకెళ్లడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
తనపై దాడి జరిగిందని స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపించిన రోజునాటి దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. -
కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు
లోక్సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ఏం సాధించొచ్చు?
ఆత్మవిశ్వాసం ప్రతిసారీ మనల్ని విజయ తీరాలకు చేర్చలేకపోవచ్చు. అన్నింటినీ మనకు అనుకూలంగా మార్చకపోవచ్చు. -
రహస్య ఓటింగ్కు విఘాతమంటూ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ప్రస్తుత ఎన్నికల విధానంలో రహస్య ఓటింగ్ అనే ప్రక్రియకు విఘాతం కలుగుతోందని, ఆ నిబంధన ఉల్లంఘనకు గురవుతోందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు?
సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై కచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది. -
పౌరుల స్వేచ్ఛ అంశంలో ప్రతి రోజూ విలువైందే: సుప్రీంకోర్టు
పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతి రోజూ విలువైందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. -
రాజ్యాంగ ధర్మాసనం తీర్పే గీటురాయి
వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సోరెన్ బెయిల్ పిటిషన్పై ఈడీకి సుప్రీం నోటీసులు
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారానికల్లా స్పందన తెలపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే మించిన సంతృప్తి ఏముంటుంది
వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’పై ఇటీవల రష్మిక ప్రయాణించారు. -
కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. -
నా చెంపపై ఏడెనిమిదిసార్లు కొట్టారు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తన చెంపపై ఏడెనిమిసార్లు గట్టిగా కొట్టారంటూ ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణ చేశారు. -
మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు
భారత్ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం. -
దేశానికి ముప్పుగా భూతాపం
భారతదేశానికి భూతాపం(గ్లోబల్ వార్మింగ్) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. -
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, భాజపా లోక్సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. -
జస్టిస్ బోపన్నకు ఘనంగా వీడ్కోలు
పదవీ విరమణ పొందుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.బోపన్నకు సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయం, సమయపాలన, ఔదార్యానికి ఆయన మారుపేరు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఈ సందర్భంగా కొనియాడారు. -
క్రిమిసంహారాల అతి వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
ఆహారోత్పత్తులపై క్రిమిసంహారాలను, రసాయనాలను అధికంగా వినియోస్తున్నందున దేశంలో మరణాల సంఖ్య పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. -
బీబీసీ డాక్యుమెంటరీపై విచారణ నుంచి వైదొలగిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీకి సంబంధించి ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జయరామ్ భంభానీ వైదొలిగారు. -
ఎయిరిండియా విమానానికి ప్రమాదం
ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికావడంతో సర్వీసును రద్దు చేశారు. పుణె నుంచి 200 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం దిల్లీకి బయలుదేరేందుకు ఆ విమానం రన్వే పైకి వచ్చింది. -
వాయవ్య భారతంలో వడగాల్పులు
విపరీత ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో వాయవ్య భారతం అల్లాడుతోంది. దిల్లీలోని నజఫ్గఢ్లో శుక్రవారం నమోదైన 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతే దేశంలో ఇప్పటివరకు అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. -
పెరుగుతున్న జీవక్రియ వ్యాధులు
మధుమేహం, అధిక రక్తపోటు, నడుం చుట్టూ కొవ్వు పెరగడం వంటి జీవక్రియ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని లాన్సెట్ వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట