Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో 2 రైళ్లు సహా ఈ నెల 24న 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా వాటిని ప్రారంభించానున్నారు.
Vande Bharat Express | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు (Vande Bharat Express) ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా వీటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రైళ్లు అందుబాటులో ఉండగా.. కొత్తగా వచ్చే వాటితో కలిసి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య 34కు చేరనుంది. తాజాగా ప్రారంభించే 9 రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 2 రైళ్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఒకటి కాచిగూడ- యశ్వంత్పూర్ మధ్య నడుస్తుంది. బుధవారం మినహా ఆరు రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. విజయవాడ-చెన్నై మధ్య నడిచే సర్వీసు మంగళవారం ఉండదు.
ఇక మిగిలిన 7 రైళ్ల విషయానికొస్తే పశ్చిమ బెంగాల్కు కొత్తగా రెండు వందే భారత్ రైళ్లు రానున్నాయి. పట్నా- హావ్డా, రాంచీ-హావ్డా మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. చెన్నై ఎగ్మోర్ - తిరునెల్వేలి; రవుర్కెలా- పూరీ; కాసర్గోడ్- తిరువనంతపురం; ఉదయ్పుర్-జైపుర్; జామ్నగర్-అహ్మదాబాద్ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగించనున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో ట్రైల్రన్లను రైల్వే శాఖ పూర్తి చేసింది.
వచ్చే ఏడాదే వందే భారత్ స్లీపర్, వందే మెట్రో
స్టేషన్లు ఇవే..
కాచిగూడ- యశ్వంత్పూర్ (బెంగళూరు) మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ రైలు.. కాచిగూడలోఉదయం 5.30కు బయలుదేరి మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. తిరిగి 2.45కు యశ్వంత్పూర్లో బయలుదేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుకుంటుంది.
విజయవాడ-చెన్నై వందేభారత్ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్కు చేరుకుంటుంది. విజయవాడలో 5.30కు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళతాయి. ఈ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుంది.
ప్రత్యేకతలు ఇవే..
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నెల 24న పట్టాలు ఎక్కనున్న రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సౌకర్యాలను రైల్వేశాఖ మెరుగుపరిచింది. మొత్తం 25 రకాల మార్పులు చేశామంది. సీట్లలో ఎనిమిదిన్నర గంటలపాటు కూర్చోవాల్సి వస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. వారు మరింత వెనక్కి వాలి నిద్రపోయేలా పుష్బ్యాక్ను, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ను, ఫుట్రెస్ట్ను మెరుగుపరిచారు. మరుగుదొడ్లలో వెలుతురును, వాష్బేసిన్ల లోతును పెంచారు. ఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో మార్పులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aditya-L1: ‘ఆదిత్య-ఎల్ 1’లో రికార్డయిన సౌరగాలులు.. ఫొటో షేర్ చేసిన ఇస్రో
Aditya-L1: సూర్యుడిని అధ్యయనం చేసే క్రమంలో లాగ్రాంజ్ పాయింట్కు చేరవవుతున్న ‘ఆదిత్య-ఎల్ 1’.. సౌర గాలులను రికార్డ్ చేసింది. ఆ ఫొటోలను ఇస్రో తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. -
SpiceJet: ఏడు గంటల ఆలస్యంగా ఎయిర్పోర్ట్కు విమానం.. గొడవకు దిగిన ప్రయాణికులు
పట్నాకు వెళ్లాల్సిన విమానం ఏడు గంటల ఆలస్యంగా దిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే అధికారులతో గొడవకు దిగారు. -
సంక్షిప్త వార్తలు
భారత్లో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించినట్లు ప్రధాని మోదీ దుబాయ్ ‘కాప్-28’ సదస్సులో తనదైన శైలిలో అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి భాజపా ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలతో తూట్లు పొడిచింది. -
ఈ సారి చలి తీవ్రత తక్కువే!
దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
ఇదేం పెళ్లిరా బాబూ!
బిహార్లోని వైశాలి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు. -
హెచ్ఐవీ పాజిటివ్ టీనేజర్లతో కోల్కతాలో దేశంలోనే తొలి కేఫ్
పశ్చిమబెంగాల్ రాజధాని నగరంలోని సౌత్ కోల్కతాలో 14 మంది టీనేజర్లు ‘కేఫ్ పాజిటివ్’ పేరుతో ఓ కాఫీ షాపు నడుపుతున్నారు. -
రూ.4,950 విద్యుత్తు బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు!
నెలనెలా విద్యుత్తు బిల్లు కట్టేటప్పుడు చెల్లించిన మొత్తానికి సిబ్బంది రసీదు ఇస్తారు. ఒకవేళ చిల్లర లేదని ఎక్కువగా చెల్లిస్తే.. తర్వాతి బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. -
కళాశాలల్లో సెల్ఫీ పాయింట్లు
వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ప్రకటన చేసింది. -
సోనియా, రాహుల్ ఆదాయపన్ను మదింపు కేసు 13కు వాయిదా: సుప్రీంకోర్టు
తమ ఆదాయపు పన్ను మదింపు వ్యవహారాన్ని సెంట్రల్ సర్కిల్కు బదిలీ చేయడాన్ని ప్రశ్నిస్తూ సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు; ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. -
10, 12 తరగతుల ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: సీబీఎస్ఈ
పది, పన్నెండు తరగతుల పరీక్షల ఫలితాలకు సంబంధించి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన వెలువరించింది. -
నేవీ నౌకకు తొలి మహిళా కమాండింగ్ అధికారి
‘అన్ని ర్యాంకులు, అన్ని పాత్రల్లో మహిళా సిబ్బందికి అవకాశం’ అన్న సూత్రానికి అనుగుణంగా నేవీ ఓడలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తెలిపారు. -
వాస్తవాలను మరుగుపరుస్తున్న నకిలీ వార్తలు
నకిలీ వార్తలు వెల్లువలో వాస్తవ సమాచారం మరుగునపడిపోతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
గ్రీన్ క్రెడిట్స్ కార్యక్రమానికి మోదీ శ్రీకారం
బంజరు భూముల్లో మొక్కల పెంపకం ద్వారా గ్రీన్ క్రెడిట్స్ను పొందడంపై దృష్టిసారించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కాప్28లో శ్రీకారం చుట్టారు. -
మొయిత్రా బహిష్కరణపై ఎథిక్స్ కమిటీ సిఫార్సు 4న లోక్సభ ముందుకు
ప్రశ్నలు అడిగినందుకు డబ్బు’ వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సు లోక్సభ ముందుకు రానుంది. -
అటవీ భూముల లీజుకు కొత్త నిబంధనలు
అటవీభూముల లీజుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. -
బాధితుణ్ని నిందితుడిగా మార్చే కుట్ర
బాధితుడినైన తనపై కల్పిత అభియోగాలు మోపి నిందితుడిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. -
బీఎస్ఎఫ్ పరిధి పెంపు కోసం పంజాబ్ పోలీసుల అధికారాన్ని హరించరాదు
అంతర్జాతీయ సరిహద్దుల వెంట తనిఖీలు, జప్తులు, అరెస్టులకు సంబంధించి బీఎస్ఎఫ్ అధికార పరిధిని 50 కి.మీ. వరకు విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ పోలీసుల అధికారాలను హరించేలా ఉండరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
స్టే ఉత్తర్వుల గడువుపై పునఃపరిశీలన
సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రత్యేకంగా పొడిగిస్తే తప్ప, ఆ ఉత్తర్వులకు ఆరు నెలల్లో గడువు తీరిపోతుందని 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. -
చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు
చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలన్న భారత్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి కోడెక్స్ ఏలిమెంటేరియస్ కమిషన్ (సీఏసీ) ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. -
సంపూర్ణ సురక్షితంగా పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులు
పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులను రానున్న రెండేళ్లలో చొరబాట్లకు వీల్లేని విధంగా పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
సిల్క్యారా సొరంగంలో కలిసికట్టుగా కార్మికులు
ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీలో సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు నీటిపైపుల ద్వారా తమ సమాచారాన్ని అధికారులకు తెలిపినట్లుగా ఆ ప్రమాదంలో చిక్కుకున్న సంతోష్ అనే ఓ కార్మికుడు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు