25న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో పర్యటించనున్నారు.

Published : 18 Jul 2021 23:46 IST

దిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించాయి. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని ద్రాస్‌ సెక్టార్‌లోని యుద్ధ స్మారకం వద్ద 26న నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో ఆయన పలు వేడుకలు సహా ఓ విద్యాసంస్థలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌డీజీ భద్రతా విభాగం ఎస్‌డీ సింగ్‌ జమ్వాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని