CBI: రష్యాకు రప్పించి.. యుద్ధంలో దించి.. మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు!
భారత్ నుంచి యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి.. వారిని ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలోకి దించుతోన్న ఓ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను సీబీఐ ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి యువకులను మోసపూరితంగా రష్యా (Russia)కు తరలించి.. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం (Ukraine War Zone)లోకి దించుతోన్న ఓ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. రష్యా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇద్దరు ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దృష్టి సారించింది. వారిని రాజస్థాన్కు చెందిన మొయినుద్దీన్ చిప్పా, క్రిస్టినాలుగా గుర్తించింది. 17 వీసా కన్సల్టెన్సీలు, వాటి యజమానులు, ఏజెంట్ల పేర్లనూ సీబీఐ తన ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సోదాలను ముమ్మరం చేసింది.
‘‘మెరుగైన జీవితం, విద్య, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నిందితులు తమ ఏజెంట్ల ద్వారా భారతీయులను రష్యాకు రప్పించారు. వారి నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. ఫీజుల్లో రాయితీ, వీసా పొడిగింపులు అందిస్తూ.. అనుమానాస్పద ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కల్పించి విద్యార్థులను మోసగించారు. ఇటువంటి 35 కేసులను గుర్తించాం’’ అని సీబీఐ తెలిపింది. రష్యాకు చేరుకున్న అనంతరం పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారని, యుద్ధంలో చేరేలా బలవంతం చేశారని పేర్కొంది. ఈ క్రమంలో యుద్ధక్షేత్రంలో కొంతమంది బాధితులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.
పర్యటక వీసాపై రష్యాకు వెళితే.. అరెస్టు చేసి సైన్యంలోకి పంపారు!
ఈ వ్యవహారంలో దిల్లీ, తిరువనంతపురం, ముంబయి, చండీగఢ్, మదురై, చెన్నై తదితర 13 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.50 లక్షలకుపైగా నగదు, ల్యాప్టాప్లు, ఫోన్లు, సీసీటీవీ ఫుటేజీ వంటి ఎలక్ట్రానిక్ రికార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలు కొనసాగుతున్నాయని ఓ అధికారి చెప్పారు. విచారణ నిమిత్తం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, వారంతా వ్యవస్థీకృత పద్ధతిలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: కేంద్రం
ఈ వ్యవహారాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బాధితులను వెంటనే భారత్కు తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను ‘సీబీఐ’ ఛేదించిందని పేర్కొంటూ.. మోసానికి పాల్పడిన ఏజెంట్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పింది. మాస్కో సైన్యంతో ముడిపడిన సహాయక ఉద్యోగాల కోసం ఏజెంట్లు ఇచ్చే తప్పుడు హామీలకు మోసపోవద్దని, ఇది ప్రాణాలకే ప్రమాదకరమని పౌరులను హెచ్చరించింది. యుద్ధక్షేత్రంలోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే విషయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
రాజులు, మహారాజులను అవమానించిన రాహుల్ గాంధీ.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని ప్రధాని మోదీ విమర్శించారు. -
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
దేవెగౌడ కంచుకోట అయిన హసన్ ఎంపీ సెగ్మెంట్ బరిలో ఉన్న ఆయన మనవడు రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. ఆయనపై అసభ్యకర వీడియోలు ప్రచారంలోకి వచ్చిన వేళ ఈ పరిణామం చోటు చేసుకొంది. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
సోషల్ మీడియా ట్రోలర్ల వికృత రూపం మరోసారి బయటపడింది. పదో తరగతిలో స్టేట్ టాపర్గా నిలిచిన బాలికను వారు వేధించారు. ఒక దశలో కొన్ని మార్కులు తగ్గినా బాగుండు అని ఆమె అనుకొనేలా చేశారు. చివరికి నెటిజన్లు, నాయకులు ఆమెకు అండగా నిలవడంతో ధైర్యం తెచ్చుకొని భవిష్యత్తుపై దృష్టిపెడతానని పేర్కొంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్కు సిట్ అధికారులు డిసెంబరులోనే సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం