Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు... అఖిలపక్ష భేటీ ప్రారంభం!
సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్షం నేడు సమావేశమయ్యింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరుగుతోన్న ఈ భేటీకి పలు పార్టీల నేతలు హాజరయ్యారు.
వ్యూహాలు రచిస్తోన్న పార్టీలు
దిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్షం నేడు సమావేశమయ్యింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరుగుతోన్న ఈ భేటీకి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున్రామ్ మేఘవాల్లు హాజరుకాగా కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్, ఆనంద్ శర్మ హాజరయ్యారు. ఇక వైకాపా నుంచి విజయసాయిరెడ్డి హాజరుకాగా.. తెలుగుదేశం తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్లు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పార్లమెంటు సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆయా రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచుతున్నాయి. ఇదే సమయంలో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరనుంది.
రేపటి నుంచి మొదలుకానున్న శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అటు ప్రభుత్వంతో పాటు విపక్షపార్టీలు కూడా కసరత్తు ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాల నుంచి ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికార ఎన్డీఏ పక్షం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నేటి సాయంత్రం 3గంటలకు భాజపా పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా హాజరుకానున్నాయి. పార్లమెంటులో విపక్షాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. అటు రాజ్యసభ కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభ పక్షనేతలతో ఛైర్మన్ నేడు భేటీకానున్నారు.
నూతన సాగు చట్టాలపై రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ సమావేశాల తొలిరోజునే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు ఈ సమావేశాల్లోనే మొత్తం 26బిల్లులు సభ ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కీలక బిల్లులు సభముందుకు వస్తోన్న నేపథ్యంలో సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని భాజపాతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ వారి సభ్యులకు ఇప్పటికే విప్ జారీ చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
గత పదేళ్ల కాలంలో దేశంలో రోజుకు సరాసరి 7.41 కి.మీ. మేర రైల్వే ట్రాకుల నిర్మాణం జరిగిందని భారతీయ రైల్వే (Indian Railways) ఇచ్చిన సమాచారంలో వెల్లడైంది. -
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నానని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా (Parshottam Rupala) పేర్కొన్నారు. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. -
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
UPSC IFS final Result| ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించిన మెయిన్ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. -
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
విధి తల్లిదండ్రులను దూరం చేసినా ఆ బాలుడు అధైర్య పడలేదు. పదేళ్ల పసిప్రాయంలో కష్టాలను దిగమింగుతూ జీవితంలో ముందడుగు వేశాడు. అతడికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సహాయం చేస్తామని పలువురు ముందుకువస్తున్నారు. -
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. -
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM