Vande Bharat: మరింత మెరుగైన ఫీచర్లతో వందే భారత్ కోచ్లు!
ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్ (Vande Bharat Express) కోచ్లలో కొన్ని ఫీచర్లను మరింత మెరుగుపరచనున్నట్లు ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కుతున్నాయి. భారతీయ రైల్వే (Indian Railways) నెట్వర్క్లో ఆధునిక తరం రైళ్లుగా ఇవి ఆవిర్భవించాయి. వీటిలో ప్రయాణికుల భద్రత కోసం ఆధునిక ఫీచర్లను పరిచయం చేయడంతోపాటు, సాంకేతికంగా కూడా వీటిని ఉన్నతంగా రూపొదించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. త్వరలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం నీలం రంగులో ఉన్న వందే భారత్ రైళ్లను నడుపుతున్నారు. త్వరలో కాషాయ రంగులో ఉన్న వందే భారత్ రైళ్లు కూడా రానున్నాయి. ఈ క్రమంలోనే వందే భారత్ కోచ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ఫీచర్లను మరింత మెరుగుపరచనున్నారు. ఇటీవల చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) సందర్శించారు. ఈ సందర్భంగా వందే భారత్ రైళ్లలో కొన్ని మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంతకీ.. వందే భారత్లో కొత్తగా ఏమేం మారబోతున్నాయంటే..?
- వందే భారత్ కోచ్లలో ప్రయాణికులు కూర్చునే సీట్ల కుషన్ గట్టిగా ఉందనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త కోచ్లలో మెత్తటి కుషన్లను ఉపయోగించనున్నారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చడంతోపాటు, ఫుట్రెస్ట్ను మరింత పొడిగించనున్నారు. వీటితోపాటు సీట్ల వెనుక మ్యాగజైన్ బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
- ప్రయాణ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సీటు రిక్లైనింగ్ యాంగిల్ను పెంచనున్నారు. దీంతో ప్రయాణికులు తమ సీట్లను మరింత వెనక్కి జరపొచ్చు. దివ్యాంగుల వీల్ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ను ఏర్పాటు చేసి, అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు.
- అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్లో మార్పులు చేయనున్నారు. కోచ్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు.
- ప్రయాణికులకు మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం ఎయిర్టైట్ ప్యానల్స్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్ను లోకో పైలట్కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేయనున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్ నుంచి మరో కోచ్లో ఏం జరుగుతుందనేది తెలిసేందుకు వీలుగా.. అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్ను మరింత పారదర్శకంగా రూపొందించనున్నారు.
- సీట్ల కింద ఉండే మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను సులువుగా యాక్సెస్ చేసేలా వాటిలో మార్పులు చేయనున్నారు. ఇవే కాకుండా టాయిలెట్లో లైటింగ్ మెరుగుపరచడంతోపాటు, వాష్ బేషిన్ సైజ్లు పెంచడం, వాటర్ ట్యాప్లు, టాయిలెట్ హ్యాండిల్స్ వంటి వాటిలో కూడా మార్పులు చేస్తున్నారు.
- వందే భారత్ రైళ్లలో కోచ్ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కార్గిల్ హీరోకు ఇండిగో అపూర్వ గౌరవం.. వీడియో వైరల్
ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో ఏసీ ఛైర్కార్ కోచ్లు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే స్లీపర్ కోచ్లను పరిచయం చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 120 స్లీపర్ కోచ్ల తయారీ కోసం రష్యాకు చెందిన ట్రాన్స్ మాష్ హోల్డింగ్ (TMH)తో భారత్కు చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఒప్పందం చేసుకుంది. మరో 80 స్లీపర్ కోచ్లను భెల్తో కలిసి టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్ తయారుచేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
-
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
-
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
-
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక