‘విశాఖ వాణి’గా రమ్యకృష్ణ

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేష్‌

Published : 03 Apr 2021 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సాయితేజ్‌ కథానాయకుడిగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేష్‌ కథానాయిక. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని చిత్రం బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సాయితేజ్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘లెజెండరీ నటి రమ్యకృష్ణతో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవం. విశాఖ వాణి పాత్రలో రమ్యకృష్ణ నటనను చూపించడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నా’’అంటూ పేర్కొన్నారు.

ఈ సినిమాలో సాయితేజ్‌ ‘అభి’ పాత్రలో నటిస్తున్నారు. ‘‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం!’’ అంటూ రమ్యకృష్ణ తీక్షణమైన చూపులతో కూడిన పోస్టర్‌ను చిత్ర బృందం పంచుకుంది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌4న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని