మన దేహమే ఓ గొప్ప ఫైటర్: Anil Ravipudi
తొలి సినిమాతోనే ఈ ‘పటాస్’ మాస్ అనిపించాడు... యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన సినిమాలో ఫన్ అయినా...
తొలి సినిమాతోనే ఈ ‘పటాస్’ మాస్ అనిపించాడు... యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన సినిమాలో ఫన్ అయినా... ఫ్రస్ట్రేషన్ అయినా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవల్సిందే. తెరపై హీరోయిజాన్ని ఆవిష్కరించడంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనేంతగా ప్రభావం చూపించారు. అందుకే తక్కువ సమయంలో స్టార్ దర్శకుడు అనిపించుకున్నారు. ‘ఎఫ్3’ సినిమాతో బిజీగా ఉన్న సమయంలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో పోరాటం చేసి కోలుకున్న అనిల్ రావిపూడి ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టేనా?
నెగిటివ్ వచ్చాక కూడా వైద్యులు మనకు వచ్చిన లక్షణాల్ని, జరిగిన చికిత్సని బట్టి మందులు ఇస్తారు. వాటిని నెల పాటు వాడాలి. కొవిడ్ తర్వాత రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుందట. అందుకే వైద్యులు చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటిస్తూ, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా.
మీకు పరీక్షల్లో పాజిటివ్ అని తెలిశాక భయపడ్డారా?
కొంచెం గందరగోళంగా అనిపించింది. నేను ధైర్యంగానే ఉన్నాను కానీ, ‘ఇంట్లో కుటుంబం ఉంది, వాళ్లకీ వస్తుందా? ఏంటి?’ అనే ఆలోచనలు మొదలయ్యాయి. ఐదారు రోజులు వైద్యులు ఇచ్చిన మందులు వాడాక కానీ, జ్వరం తగ్గలేదు. 12 రోజుల తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. మానసికంగా దృఢంగా ఉంటే... మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనకు అండగా ఉంటుంది. కరోనా విషయంలో సొంత వైద్యం వద్దు. ఫేస్బుక్లో చూసో, వాట్సాప్లో వచ్చిందనో ఏవి పడితే ఆ మందులు వాడకూడదు.
ఎప్పుడూ మాస్క్తోనే కనిపించేవారు. మీరు ఎలా దీని బారినపడ్డారు?
‘ఎఫ్3’ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమని చెన్నై వెళ్లా. అక్కడ ఓ హోటల్లో బస చేశాం. హోటల్కి ఎవరెవరు వచ్చి వెళుతుంటారో తెలియదు కదా, అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు, మనం అజాగ్రత్తగా మెలిగి ఉండొచ్చు. మొదట నా స్నేహితుడు సాయి, ఆ తర్వాత నేను కరోనా బారిన పడ్డాం. నా భార్య, పిల్లలకీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడంతా కోలుకుంటున్నాం.
‘ఎఫ్3’ ఎంత వరకు పూర్తయింది?
సగం సినిమా పూర్తయింది. ఏప్రిల్ 15 నుంచి మైసూర్లో చిత్రీకరణ మొదలు పెట్టాలనుకున్నాం. 14నే నాకు పాజిటివ్ వచ్చింది. మా ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ఈ షెడ్యూల్ చేస్తే 80 శాతం పూర్తవుతుంది.
బాలకృష్ణ, మహేష్బాబుతో సినిమాలు మొదలుకొని ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ వరకు పలు సినిమాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ దేనిపై దృష్టిపెట్టారు?
మొదట ప్రేక్షకులంతా ఈ సెకండ్ వేవ్ ఒత్తిడి నుంచి బయట పడేలా ‘ఎఫ్3’తో కడుపుబ్బా నవ్వించాలనేది నా ఆలోచన. బాలకృష్ణ గారితో చేయాల్సిన సినిమా అంటారా? ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైంది. అదొక భిన్నమైన జోనర్ సినిమా అవుతుంది. అది మల్టీస్టారర్ సినిమా కాదు. అలాగే మహేష్ సర్తో సినిమాకీ కథ ఓకే అయ్యింది. త్రివిక్రమ్గారితో సినిమా ముందుకొచ్చింది కాబట్టి, అది పూర్తయిన తర్వాత మా ప్రాజెక్టు ఉంటుంది. ‘సరిలేరు నీకెవ్వరు’కి పూర్తి భిన్నమైన కథతో ఆ సినిమా ఉంటుంది. ‘రాజా ది గ్రేట్’కి సీక్వెల్ ఆలోచన కూడా ఉంది. ‘ఎఫ్3’ తర్వాత చేయబోయే సినిమా ఏమిటనేది ఒక నెలలో చెబుతా.
దేహమే బలం.. పోరాటం చేయగలం
‘‘పనులే కాదు, ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలని... ఆరోగ్యమే మహా భాగ్యం అని కరోనా మరోసారి గుర్తు చేసింది. ఎంత బిజీగా ఉన్నా... శారీరక ధృఢత్వంపైన, ఆహారపు అలవాట్లపైన దృష్టిపెట్టాలి. అప్పుడే మనకు ఏ కష్టం వచ్చినా పోరాటం చేయగలం. ప్రపంచంలో అన్ని వ్యాక్సిన్లు, మెడిసిన్ కంటే కూడా మన దేహమే గొప్ప ఫైటర్. మన దేహాన్ని మనం కరెక్టుగా ఉంచుకోగలిగితే అదే పెద్ద మెడిసిన్. కరోనా విషయంలో సానుకూల ధోరణి అవసరం. చనిపోతున్నవాళ్ల కంటే కూడా కోలుకుంటున్నవారే ఎక్కువ కదా, అందుకే భయాల నుంచి బయటకి వచ్చి జాగ్రత్తలు తీసుకుంటూనే పోరాటం చేయడం అలవాటు చేసుకోవాలి’’
‘‘ప్రపంచంలో మనం బాగుండాలని కోరుకునే మొట్ట మొదటి వ్యక్తి... అమ్మ. మా అమ్మ పేరు.. అనంత లక్ష్మి. మనం ఎంత దూరంలో ఉన్నా సరే..వాళ్ల మనసులు మన చుట్టూనే తిరుగుతుంటాయి. స్వార్థం ఎరుగని ప్రేమ మూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మన కళ్ల ముందున్న దైవాలు అమ్మానాన్నలు. వాళ్లు బాగుంటే మనం బాగుంటాం. అందుకే అమ్మానాన్న ఆరోగ్యాల గురించి ఈ విపత్కర సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నా తల్లిదండ్రులకి ఇద్దరికీ వ్యాక్సిన్ వేయించా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల