Aditi Rao Hydari: అందుకు బాధగా ఉంది.. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకోగలను: అదితి
ధర్మేంద్ర, నసీరుద్దీన్ షా, అదితిరావు హైదరి తదితరులు నటించిన వెబ్సిరీస్ ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’ (Taj: Divided by Blood). దీని గురించి అదితి పలు ఆసక్తి విశేషాలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్రతో కలిసి ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’ (Taj: Divided by Blood)లో నటించకపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు అదితి రావు హైదరి (Aditi Rao Hydari). తమ కాంబినేషన్లో సన్నివేశాలు లేకపోవడమే అందుకు కారణమని తెలిపారు. ఇతర నట దిగ్గజాలతో కలసి పనిచేయడం గొప్ప అనుభూతి పంచిందన్నారు. నసీరుద్దీన్ షా, ధర్మేంద్ర, జరీనా వాహబ్, అదితి తదితరులు ప్రధానధారులుగా దర్శకులు అజయ్ సింగ్, ప్రశాంత్ సింగ్, విభు, రాన్ స్కాల్పెల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా అదితి పలు విశేషాలు పంచుకున్నారు.
అవకాశం వస్తే.. ఆలోచించా
‘తాజ్’లోని అనార్కలి పాత్రలో నటించే అవకాశం నాకు వచ్చినప్పుడు ‘చేయగలనా?’ అని ఆలోచించా. ఒకవేళ నేను చేయనని చెప్పాలనుకున్నా దర్శకులు నా మాట వినేవారు కాదేమో. నాపై అంతగా నమ్మకం పెట్టుకున్నారు. మొఘల్- ఏ- ఆజామ్ (హిందీ చిత్రం) తరహాలోనే ఉన్నా భిన్నమైన కోణంలో ఈ సిరీస్ సాగుంతుందని, నా క్యారెక్టర్ మధుబాల పోషించిన పాత్రను పోలి ఉంటుందని చెప్పారు. ఆ ఛాలెంజింగ్ రోల్లో నటించేందుకు ఓకే అన్నా. ఇది మాత్రమే కాదు నేను ఎంపిక చేసుకున్న ప్రతి పాత్రను ఎంతో ఇష్టంగా పోషించా. దర్శకులు నా నుంచి ఎలా నటనను ఆశిస్తున్నారో దాన్ని ప్రదర్శించేందుకు కృషి చేస్తుంటా. ‘ఓ క్యారెక్టర్ వచ్చింది.. చేసేద్దాం’ అనే ధోరణిలో ఎప్పుడూ ఉండను.
విభిన్న కోణాలున్న పాత్ర..
ఈ అనార్కలి విషయానికొస్తే.. ఓ వైపు అమాయకంగా, మరోవైపు నిర్భయంగా కనిపిస్తుంది. ఆ పాత్రలో స్వచ్ఛత ఉంది. పలు విభిన్న కోణాలున్న ఈ రోల్ ప్లే చేయడం గొప్పగా అనిపిస్తుంది. ప్రేమను మించిన శక్తిమంతమైంది మరోటి లేదని ఆ పాత్ర పోషించడం వల్ల అర్థమైంది. అంజు మోదీ నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే కథ/పాత్ర అయినా దుస్తులు సింపుల్గానే ఉంటాయి. ఆభరణాలు కూడా తేలికగా ఉండేలా ప్లాన్ చేశారు.
ఆ బాధ ఉంది..
ఈ సిరీస్ వల్ల ఎంతోమంది లెజెండ్స్తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ముఖ్యంగా నసీరుద్దీన్ షాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి. మరోవైపు, ధర్మేంద్రతో నటించలేకపోయాననే బాధ ఉంది. ఆయన నటించిన ఎపిసోడ్లలో నా పాత్ర లేకపోవడంతో ఛాన్స్ మిస్ అయింది. నా దృష్టిలో గొప్ప నటులంతా నిగర్వులు. సరదాగా ఉంటారు. చేస్తున్న పనిని ప్రేమిస్తారు. పక్కవారిని కంఫర్ట్ జోన్లో ఉంచుతారు.
కఠినంగా వ్యవహరిస్తా..
నేనెప్పుడూ కఠినంగానే వ్యవహరిస్తుంటా. స్వీయ విమర్శలు ఎక్కువగా చేసుకుంటుంటా. నాకు మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది. సినిమాలను 50- 60 రోజుల్లో పూర్తి చేయగలం. అదే వెబ్ సిరీస్ల విషయంలో ఎక్కువ సమయం పడుతుంది. నటులెవరైనా సినిమాలు, సిరీస్లకు వ్యత్యాసం చూడరు. ప్రేక్షకులను మెప్పించగలమా, లేదా? అనేదే పట్టించుకుంటారు.
ఆమె బయోపిక్లో నటించాలనుంది..
‘బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా’ అంశాన్ని నేను పట్టించుకోను. తమిళ చిత్రంతో నటిగా నా కెరీర్ మొదలైంది. నాకు ప్రాంతీయ భేదాల్లేవు. నాకు తెలుగు, తమిళ్ బాగా అర్థమవుతుంది. హిందీ మాట్లాడగలను. ఉర్దూ మేనేజ్ చేస్తా. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. దాన్ని నేను అర్థం చేసుకోగలను. మాపై వారు చూపించే ఆదరాభిమానాలకు మురిసిపోతుంటా. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూశా. బాగా ఆకట్టుకుంది. రాజమౌళిసహా చిత్ర బృందం ప్రతిభ అమోఘం. ఒకవేళ నటి రేఖ బయోపిక్లో నటించే అవకాశం వస్తే అదొక గొప్ప అవకాశంగా భావిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!