సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌... అల్లు అర్జున్‌ ఏమన్నారంటే?

అల్లు అర్జున్‌ సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. 

Published : 14 Mar 2024 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య పోటీ లేకున్నా... సోషల్‌ మీడియాలో సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు ఆసక్తికర సమాధానాలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ఈ విషయంపై ఓ షోలో స్పందించారు. ‘‘ఆరు దశాబ్ధాలు  బాలీవుడ్‌ మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం హిట్‌ రేట్‌ తగ్గిందని పరిశ్రమను విమర్శించడం సరికాదు. దక్షిణాది, ఉత్తరాది అన్న తేడా లేదు. రెండూ సోదర భావంతో గౌరవించుకుంటున్నాయి. సౌత్‌ సినిమాల ప్రభావం నార్త్‌ పై ఉన్నట్లు అక్కడి సినిమాల ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది’’ అని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్‌ సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa: The Rule). అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఆగస్టు 15న విడుదల కానుంది. 2021లో రిలీజ్‌ అయ్యి సూపర్‌ హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa)కు సీక్వెల్‌ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ విశేష ఆదరణ సంపాదించుకోవడంతో పాటు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని