కార్పొరేట్‌ ఉద్యోగుల కష్టాలు..‘అర్థమైందా అరుణ్ కుమార్’

హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ కీలక పాత్రల్లో నటించిన ‘అర్థమైందా అరుణ్‌కుమార్‌’ ట్రైలర్‌ విడుదలైంది.

Published : 22 Jun 2023 16:11 IST

హైదరాబాద్‌: చిన్న ప‌ట్ట‌ణం నుంచి మ‌హా నగరానికి వచ్చి ఉద్యోగిగా జీవితం మొదలు పెట్టిన అరుణ్ కుమార్ అనే యువ‌కుడి క‌థ‌తో రూపొందించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘అర్థమైందా అరుణ్‌కుమార్‌’ (Arthamayyindha Arun Kumar). ‘ప్రతి ఒక ఇంటర్న్‌ కథ’ అనేది ఉప శీర్షిక. హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జొనాథన్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. (Arthamayyindha Arun Kumar on aha) జూన్‌ 30వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్పొరేట్ ప్ర‌పంచంలో ఇంట‌ర్న్‌గా ప్ర‌యాణం మొదలు పెట్టిన ఓ యువ‌కుడికి ఎలాంటి అనుభ‌వాలు ఎదురయ్యాయి? ప్రేమ‌, క‌ష్ట‌న‌ష్టాలతో పాటు ఏదో సాధించాల‌నుకునే ఆ యువ‌కుడు ఆ స‌వాళ్ల‌ను ఎదుర్కొని త‌న‌దైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడ‌నే విష‌యాల‌ను ఇందులో చూపించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని