నటి బంగ్లాను కక్ష సాధించేందుకే కూల్చారు: కోర్టు
కార్యాలయం కూల్చివేత కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం సాధించింది. ఆమెకు అనుకూలంగా ముంబయి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంపై కోర్టు బీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది....
కంగనాకు అనుకూలంగా తీర్పు వెల్లడించిన ముంబయి కోర్టు
ముంబయి: కార్యాలయం కూల్చివేత కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అనుకూలంగా ముంబయి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంపై కోర్టు.. బీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్ష సాధించేందుకే ఆమె బంగ్లాను కూల్చివేశారంటూ పేర్కొంది. తన బంగ్లాను అక్రమంగా కూల్చి వేశారంటూ రెండు నెలల క్రితం కంగనా వేసిన పిటిషన్ను శుక్రవారం కోర్టు పరిశీలించింది. ‘కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. బాధ్యత లేని ఓ వ్యక్తి వ్యాఖ్యలను పట్టించుకోకపోవడమే ఉత్తమం. ఇందుకు ఆమెపై మీ బలాన్ని చూపించాల్సింది కాదు’ అని పేర్కొంది.
శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో ప్రచురితమైన వార్తలు, ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ చేసిన పలు వ్యాఖ్యల క్లిప్పింగులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కంగనాపై బెదిరింపులకు పాల్పడ్డట్లు స్పష్టం చేసింది. ‘బీఎంసీది కక్ష్య సాధింపు చర్య. కంగనాను బెదిరించేందుకే ఆమె కార్యాలయాన్ని కూల్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని జస్టిస్ ఎస్జే కతావళ్ల, జస్టిస్ రియాజ్ చగ్లాతో కూడిన బెంచ్ పేర్కొంది. నటికి జరిగిన నష్టాన్ని బీఎంసీనే పూడ్చాలని తీర్పు వెల్లడించింది. కూల్చివేసిన భాగాన్ని పునర్నిర్మించేందుకు బీఎంసీకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా న్యాయస్థానం కంగనాకు సూచించింది. కూల్చివేయని ప్రాంతాన్ని క్రమబద్ధీకరించడానికి కూడా ఆమె దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
కోర్టు తీర్పుపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేసింది. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించింది. ‘ఓ వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గెలిస్తే అది ఆ ఒక్క వ్యక్తి గెలుపు మాత్రమే కాదు.. అది ప్రజాస్వామ్య గెలుపు. ఈ కేసు వ్యవహారంలో నాకు మద్దతుగా నిలిచిన వారితోపాటు, నా కలలను చిదిమివేసినందుకు గాను నవ్వినవారికి కూడా నా ధన్యవాదాలు’ అంటూ తనదైన శైలిలో స్పందించింది. ఈసందర్భంగా బీఎంసీ ఫొటోతోపాటు, ఆమె ఫొటోను జోడిస్తూ మీరు విలన్గా మారితే నేను హీరోనయ్యాను అంటూ ట్వీట్ చేసింది.
నటుడు సుశాంత్సింగ్ కేసు దర్యాప్తు గురించి కంగనా మాట్లాడుతూ మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే భయంగా ఉందని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు కాస్తా రాజకీయ దుమారం రేపాయి. దీంతో శివసేన నేత సంజయ్రౌత్కు, కంగనకు మధ్య కొన్నిరోజుల పాటు మాటల యుద్ధం సాగింది. ఈనేపథ్యంలోనే సెప్టెంబర్ 9వ తేదీన ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బాంద్రాలోని కంగనా రనౌత్ కార్యాలయ కూల్చివేత ప్రారంభించింది. బంగ్లాలోని కొంత భాగాన్ని కూల్చివేసింది. దీంతో నటి ముంబయి కోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు ఆపాలంటూ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. తన కార్యాలయాన్ని అక్రమంగా కూల్చివేసినందుకుగానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని నటి డిమాండ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
రేవ్ పార్టీ విషయంలో తనపై వచ్చిన రూమార్స్పై జానీ మాస్టర్ స్పందించారు. -
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ పెట్టారు. -
మరోసారి ఆ తమిళ దర్శకుడితో చిరు సినిమా!
స్టార్ హీరో చిరంజీవి అప్కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
‘మిరాయ్’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నారు మంచు మనోజ్. ఈ సినిమాలోని ఆయన లుక్ విడుదలైంది. -
రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదు.. తప్పుడు కథనాలను నమ్మొద్దు: శ్రీకాంత్
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.
-
ఆనంద్ దేవరకొండ ఫన్ అండ్ యాక్షన్.. ‘గం గం గణేశా’ ట్రైలర్ చూశారా!
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. -
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్.. పేరేంటంటే
నటి యామీ గౌతమ్ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
‘మిరాయ్’ ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ లుక్!
మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ