ఎవ్వరినీ వదలను అంటున్న సుధీర్‌...

‘రష్మి స్టేజ్‌ మర్యాదగా ఇస్తే మంచిది. ఇవ్వకపోతే ఏంటి? లాగేసుకుంటా. లాగడానికిదేమన్న యాంకరింగ్ సీటా ఏంటి’ అంటూ సరదాగా అనసూయ, రష్మిలు నవ్వులు పూయించారు. ఏంటిది అనుకుంటున్నారా? డిసెంబర్‌ 31 వేడుకల్లో భాగంగా ఈటీవీలో ‘డీజే 2021’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది.

Updated : 18 Aug 2022 11:00 IST

హైదరాబాద్: ‘రష్మి స్టేజ్‌ మర్యాదగా ఇస్తే మంచిది. ఇవ్వకపోతే ఏంటి? లాగేసుకుంటా. లాగడానికిదేమన్న యాంకరింగ్ సీటా ఏంటి’ అంటూ సరదాగా అనసూయ, రష్మిలు నవ్వులు పూయించారు. ఏంటిది అనుకుంటున్నారా? డిసెంబర్‌ 31 వేడుకల్లో భాగంగా ఈటీవీలో ‘డీజే 2021’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరగనున్న ఈవెంట్‌కి సంబంధించిన ప్రోమో విడుదలయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన మరో వీడియో విడుదలయింది. 

షోలో భాగంగా ‘నాకు ఓటమి అంటే ఏంటో తెలియదు. ఆడపులి ఇక్కడ. వదలను అని రష్మి, నాకు గెలవడం తప్ప ఇంకేమీ తెలియదు. పెద్ద పులి ఇక్కడ. నేను కూడా వదలను అని అనసూయ, పులి రాజా ఇక్కడ. ఎవ్వరినీ వదలను’ అంటూ సుధీర్‌ నవ్వుల వర్షం కురిపించారు. అంతేకాకుండా కథానాయిక ఆమని స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసి యాంకర్‌ ప్రదీప్‌తో కలిసి ఆడిపాడారు. స్కిట్‌లో భాగంగా రోజా, ఆది మధ్య సంభాషణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ‘ఢీ’, ‘జబర్దస్త్‌’ టీమ్‌ సభ్యులందరూ ఫోక్‌, హిపాప్‌, ప్రాపర్టీ డ్యాన్స్‌లతో పోటీ పడ్డారు. నవ్వుల హంగామాతో సాగే ఈ స్పెషల్ ప్రోమో ప్రస్తుతం వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31 రాత్రి ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి..!


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని