Geetha Madhuri: వేడుకగా గీతామాధురి సీమంతం.. ఫొటోలు వైరల్‌

గాయని గీతా మాధురి (Geetha Madhuri) సీమంతం వేడుక ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 04 Feb 2024 01:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాయని గీతామాధురి (Geetha Madhuri) తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా మాధురి, నందు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Social Look: దివి ఆసనాలు.. మృణాల్‌ మెరుపులు..

గాయనిగా గీతా మాధురికి తెలుగులో మంచి పేరు ఉంది. ఎన్నో చిత్రాల్లో ఆమె సూపర్‌హిట్‌ పాటలు పాడారు. కెరీర్‌లో రాణిస్తోన్న తరుణంలోనే నటుడు నందుతో ఏడడుగులు వేశారు. 2014లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (దాక్షాయణి ప్రకృతి) ఉంది. త్వరలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ‘‘ఫిబ్రవరి 2024లో మా దాక్షాయణి ప్రకృతి అక్క కానుంది’’ అంటూ గతేడాది డిసెంబర్‌లో పోస్ట్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని