అందుకే వర్మ-చిరు సినిమా ఆగింది..!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, అగ్రకథానాయకుడు చిరంజీవి.. వీరిద్దరి కాంబినేషనల్‌లో ఓ సినిమా వస్తే..? ఆ సర్‌ప్రైజే వేరప్పా. అయితే ఆ సర్‌ప్రైజ్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకే ఆర్జీవీ.. చిరు కోసం ఓ కథ సిద్ధం చేశాడు. రెండు పాటలు కూడా చిత్రీకరించారు..

Published : 08 Jan 2020 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, అగ్రకథానాయకుడు చిరంజీవి.. వీరిద్దరి కాంబినేషనల్‌లో ఓ సినిమా వస్తే..? ఆ సర్‌ప్రైజే వేరప్పా. అయితే ఆ సర్‌ప్రైజ్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకే ఆర్జీవీ.. చిరు కోసం ఓ కథ సిద్ధం చేశాడు. రెండు పాటలు కూడా చిత్రీకరించారు. కానీ, కొంతకాలం తర్వాత స్క్రిప్ట్‌ విషయంలో చిరుకి కాస్త సందేహం ఉండటంతో కొంతమేర మార్చాలన్నారట. కథ విషయంలో తాను అనుకున్నది తప్ప ఎవరు చెప్పినా ఆర్జీవీ వినడనే విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆర్జీవీ రాజీపడకపోవడంతో మధ్యలోనే ఆ చిత్రం నిలిచిపోయింది. అప్పట్లో ఈ విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? ‘వినాలని ఉంది’. టబు కథానాయిక. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు ఆగిపోవడంతో.. ఈ చిత్రం కోసం స్వరపరిచిన గీతాల్ని దర్శకుడు గుణశేఖర్, చిరుతో తెరకెక్కించిన ‘చూడాలని ఉంది’ చిత్రంలో ఉపయోగించారు. ఇప్పటికీ ఆర్జీవీ- చిరు కాంబినేషన్‌లో చిత్రం రాలేదు. భవిష్యత్తులోనైనా వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని