మహేశ్‌ సినిమాకు తమన్‌ సంగీతం..!

‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ‘అలవైకుంఠపురములో’తో సంగీత దర్శకుడు తమన్‌ హిట్లు కొట్టి మంచి జోష్‌ మీదున్నారు.

Published : 20 Jan 2020 22:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ‘అలవైకుంఠపురములో’తో సంగీత దర్శకుడు తమన్‌ హిట్లు కొట్టి మంచి జోష్‌ మీదున్నారు. ఇదిలా ఉండగా మహేశ్‌బాబు ఇప్పటికే తన 27వ సినిమా కోసం సిద్ధమయ్యాడు. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి తన తర్వాతి సినిమా చేయనున్నాడు. అయితే, ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. అయితే, మహేశ్‌ తరువాతి సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో చిత్రానికి తమన్‌ సమకూర్చిన సంగీతం అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో హీరో మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి.. తమన్‌ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తమన్‌ ఇంతకు ముందు ‘బిజినెస్‌మ్యాన్‌’ సినిమాకు సంగీతం అందించారు. ఆ సినిమాలోని ‘సారొస్తారా.’. ‘బ్యాడ్ బాయ్స్‌’ వంటి పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మహేశ్‌, వంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘మహర్షి’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో రానున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. వచ్చే ఏడాదికల్లా చిత్రీకరణ పూర్తి చేసి అభిమానులకు మరో సంక్రాంతి కానుక ఇవ్వాలని మహేశ్‌బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని