నాప్రేమ గురించి తెలిసీ.. సల్మాన్‌ అలా చేశాడు!

తను వ్యాపారవేత్త హిమాలయ దాసానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసి కూడా సల్మాన్‌ చనువుగా ప్రవర్తించేవాడని అలనాటి నటి భాగ్యశ్రీ ఓ సందర్భంలో అన్నారు. వీరిద్దరు కలిసి 1989లో నటించిన సినిమా ‘మైనే ప్యార్‌ కియా’. ఇందులో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అలరించింది. సల్లూభాయ్‌ ....

Published : 29 Feb 2020 16:21 IST

ముంబయి: తను వ్యాపారవేత్త హిమాలయ దాసానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసి కూడా సల్మాన్‌ చనువుగా ప్రవర్తించేవాడని అలనాటి నటి భాగ్యశ్రీ ఓ సందర్భంలో అన్నారు. వీరిద్దరు కలిసి 1989లో నటించిన సినిమా ‘మైనే ప్యార్‌ కియా’. ఇందులో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అలరించింది. సల్లూభాయ్‌ హీరోగా నటించిన తొలి సినిమా ఇది కావడం విశేషం. సూరజ్‌ భర్జత్యా దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ సమయానికి భాగ్యశ్రీ, హిమాలయ ప్రేమలో ఉన్నారట. అప్పట్లో జరిగిన సంఘటనల్ని భాగ్యశ్రీ ఓ సందర్భంలో పంచుకున్నారు. తనకు చిరాకు తెప్పించాలనే ఉద్దేశంతో సల్మాన్‌ అతి చనువుగా వ్యవహరించేవాడని పేర్కొన్నారు.

‘నేను ప్రేమలో ఉన్న విషయం ముందు సల్మాన్‌కే తెలిసింది. ‘దిల్‌ దివానా’ పాట షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ నా వెంటే తిరిగేవాడు. నా చెవులు, ముఖం దగ్గరికి వచ్చి పాటలు పాడేవాడు. నేను వార్నింగ్‌ కూడా ఇచ్చా. అలా రెండు రోజులు నన్ను విసిగించిన తర్వాత.. నా ప్రేమ విషయం తెలుసని చెప్పాడు. అంతేకాదు హిమాలయను లొకేషన్‌కు పిలిపిస్తానని అనేవాడు’ అని భాగ్యశ్రీ గుర్తు చేసుకున్నారు. ‘మైనే ప్యార్‌ కియా’ సినిమా షూటింగ్‌ తర్వాత భాగ్యశ్రీ, హిమాలయ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల వీరి కుమారుడు అభిమన్యు దాసానీ ‘మర్ద్‌కో దర్ద్‌ నహీ హోతా’ సినిమాతో బాలీవుడ్‌ అరంగేట్రం చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని