కొన్నాళ్లు పోయాక ..ఎలాగూ తప్పదు కదా!

శివాజీ గణేశన్‌ హీరోగా జెమినీ సంస్థ తమిళంలో నిర్మించిన ‘మోటార్‌ సుందరం పిళ్ళై’ బాగా ఆడింది. ఆ చిత్రాన్ని ఏయన్నార్‌తో తెలుగులో నిర్మించాలని ‘మధు పిక్చర్స్‌’ నిర్మాత పి.మల్లికార్జునరావు

Published : 11 Jun 2020 13:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శివాజీ గణేశన్‌ హీరోగా జెమినీ సంస్థ తమిళంలో నిర్మించిన ‘మోటార్‌ సుందరం పిళ్ళై’ బాగా ఆడింది. ఆ చిత్రాన్ని ఏయన్నార్‌తో తెలుగులో నిర్మించాలని ‘మధు పిక్చర్స్‌’ నిర్మాత పి.మల్లికార్జునరావు అనుకున్నారు. నడి వయసులో పిల్లల తండ్రి పాత్రలో తనను చూసేందుకు అభిమానులు అంగీకరించరంటూ ఏయన్నార్‌ వద్దన్నారట. అప్పుడు ఓ రోజు జెమినీ అధినేత ఎస్‌.ఎస్‌.వాసన్‌ ‘మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను’ అంటూ నాగేశ్వరరావుకు ఫోన్‌ చేశారట. 

‘మీరు పెద్దవారు. నా వద్దకు రావడమేమిటి? నేనే వస్తాను’ అంటూ ఏయన్నార్‌ చెబుతున్నా వాసన్‌ పనిగట్టుకుని వచ్చారట. వచ్చి, ‘ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఇదంటే నాకెంతో ఇష్టం. ఈ పాత్రలో గ్లామర్‌ లేదని మీరు భావించవద్దు. కొన్నాళ్ళు పోయాక వయసు మళ్ళిన పాత్రలు ఎలాగూ వేయక తప్పదు. ఇప్పుడు మీరు నటిస్తేనే ఈ పాత్రకు నిండుదనం వస్తుంది’ అంటూ ఏయన్నార్‌ని ఒప్పించారట. ఫలితంగా ‘మంచి కుటుంబం’ రూపొందింది. వాసన్‌ ఊహించినట్లుగానే ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు వెర్షన్‌కు తాను నిర్మాత కాకపోయినా తనకెంతో ఇష్టమైన చిత్రం అన్ని భాషలలోనూ బాగా ఆడాలని భావించే వాసన్‌ లాంటి వారు ఎంతమంది ఉంటారు?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని