Kamal Haasan: ఒకే ఫ్రేమ్‌లో కమల్‌ హాసన్‌-రజనీకాంత్‌.. విశేషం ఏంటంటే?

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు తాజాగా ఓ స్టూడియోలో కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Published : 23 Nov 2023 17:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండస్ట్రీలో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), రజనీకాంత్. కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ హీరోలు తాజాగా ఓ స్టూడియోలో కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కమల్‌ హాసన్‌ నటిస్తోన్న ‘భారతీయుడు2’ (Indian 2) , రజనీకాంత్‌ నటిస్తోన్న తన 170వ చిత్రాన్ని (Thalaivar 170) ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీళ్లిద్దరూ ఓ స్టూడియోలో కలిసినట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ స్టార్‌ హీరోలు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇదే స్టూడియోలో మనం కలిసి ఎన్ని సంవత్సరాలైందని కమల్‌హాసన్‌ను రజనీకాంత్‌ అడగ్గా.. 21 సంవత్సరాలైందంటూ ఆయన సమాధానం చెప్పారు. ఈ ఫొటోలను షేర్‌ చేసిన లైకా ప్రొడక్షన్స్‌.. లెజెండరీ నటుల సినిమాలను ఒకేసారి నిర్మించే అవకాశం రావడం గర్వంగా ఉందని పేర్కొంది.

అలియాని హీరోయిన్‌గా తీసుకోవద్దని ఇద్దరు హీరోలు మెసేజ్‌ పెట్టారు: ప్రముఖ దర్శకుడు

ఇక ‘భారతీయుడు2’ సినిమా విషయానికొస్తే .. శంకర్‌-కమల్‌ హాసన్‌ల కాంబోలో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రత్యేక వీడియోకు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ఇందులో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.350కోట్లతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

అలాగే రజనీ (Rajinikanth) 170వ చిత్రాన్ని కూడా లైకా ప్రొడక్షన్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈచిత్రంలో అగ్ర నటీనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సామాజిక సందేశంతో కూడిన భారీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని